Political News

అఫీషియల్.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు

కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు, ప్రచారాన్ని నిజం చేస్తూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టుగా వేణుగోపాల్ ప్రకటించారు. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ చేసేందుకు 2 రోజుల క్రితం గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.

దీంతో, దాదాపుగా ఆ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారంలోకి వచ్చింది. దీంతో, ఏపీలో కూడా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది. దాంతోపాటు, వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలందరూ టీడీపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతోనే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

This post was last modified on January 16, 2024 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago