కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు, ప్రచారాన్ని నిజం చేస్తూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టుగా వేణుగోపాల్ ప్రకటించారు. వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ చేసేందుకు 2 రోజుల క్రితం గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది.
దీంతో, దాదాపుగా ఆ పార్టీ ఏపీలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయితే, ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారంలోకి వచ్చింది. దీంతో, ఏపీలో కూడా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించింది. దాంతోపాటు, వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలందరూ టీడీపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతోనే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
This post was last modified on January 16, 2024 7:08 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…