ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన రాజంపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి బ్యాక్ టు పెవిలియన్ అంటూ.. తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేం దుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన టీడీపీ కడపకు చెందిన ముఖ్య నేతను సంప్ర దించారు కూడా. వచ్చే ఎన్నికల్లో టికెట్ను ఆశిస్తున్నారు. దీనికి టీడీపీ అధిష్టానంకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన మేడా మల్లికార్జున రెడ్డి.. తర్వాత.. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. 2019లో ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఇక, గత రెండేళ్లుగా ఆయన పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. జిల్లా విభజన అంశం. ఇది ఈ నియోజకవర్గంలో భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని మేడా నమ్ముతున్నారు. రాజంపేటను కేంద్రంగా చేసుకుని అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలనేది ఇక్కడి వారి డిమాండ్.
కానీ, ప్రభుత్వం మాత్రం రాజంపేట కాకుండా.. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసిం ది. దీనిని వ్యతిరేకిస్తూ.. కొన్ని రోజుల పాటు ఈ నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు హోరెత్తాయి. ఇదే విషయంపై మేడా కుటుంబం కూడా రెండుగా చీలిపోయి.. ఉద్యమాలు చేసింది. ఇక, నియోజకవర్గం సెగను ముందుగానే గుర్తించిన ఎమ్మెల్యే మేడా.. ఇదే విషయాన్ని పార్టీకి చేరవేసినా.. ఫలితం దక్కలేదు. దీంతో ఆయన అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
ఇదిలావుంటే.. తన యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్… టీడీపీ అధికారంలోకి వస్తే.. రా యచోటిని మార్చి.. రాజంపేటను కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఇక్కడి టీడీపీ సానుభూతిని పెంచింది. వాస్తవానికి కడపలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. సో.. దీంతో ఇప్పుడు కడపలో తొలి ఓటమి వైసీపీకి ఇక్కడే దక్కుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.
ఫలితంగా.. తనకు టికెట్ ఇవ్వకపోయినా.. ఏమాత్రం మేడా చింతించలేదు. కారణం.. ఎలానూ ఆయన పార్టీని మారాలని నిర్ణయించుకున్నందునే. సో.. ఇప్పుడు ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఆయనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. గెలుపు కూడా రాసి పెట్టుకోవచ్చని చెబుతున్నారు.
This post was last modified on January 16, 2024 4:48 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…