Political News

ఆ ఎమ్మెల్యే… టీడీపీ టు టీడీపీ.. వ‌యా వైసీపీ… !

ఉమ్మ‌డి క‌డప జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీల‌క‌మైన రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ.. తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేం దుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయ‌న టీడీపీ క‌డ‌ప‌కు చెందిన ముఖ్య నేత‌ను సంప్ర దించారు కూడా. వ‌చ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశిస్తున్నారు. దీనికి టీడీపీ అధిష్టానంకూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి.. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. 2019లో ఆ పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, గ‌త రెండేళ్లుగా ఆయ‌న పార్టీతో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి కార‌ణం.. జిల్లా విభ‌జ‌న అంశం. ఇది ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎఫెక్ట్ చూపించే అవ‌కాశం ఉంద‌ని మేడా న‌మ్ముతున్నారు. రాజంపేట‌ను కేంద్రంగా చేసుకుని అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటు చేయాల‌నేది ఇక్క‌డి వారి డిమాండ్‌.

కానీ, ప్ర‌భుత్వం మాత్రం రాజంపేట కాకుండా.. రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటు చేసిం ది. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొన్ని రోజుల పాటు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌ర్నాలు నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఇదే విష‌యంపై మేడా కుటుంబం కూడా రెండుగా చీలిపోయి.. ఉద్య‌మాలు చేసింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం సెగ‌ను ముందుగానే గుర్తించిన ఎమ్మెల్యే మేడా.. ఇదే విష‌యాన్ని పార్టీకి చేర‌వేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న అప్ప‌టి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇదిలావుంటే.. త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో నారా లోకేష్‌… టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. రా యచోటిని మార్చి.. రాజంపేట‌ను కేంద్రంగా ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇది ఇక్క‌డి టీడీపీ సానుభూతిని పెంచింది. వాస్త‌వానికి క‌డ‌ప‌లో టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది కూడా ఒక‌టి. సో.. దీంతో ఇప్పుడు క‌డ‌ప‌లో తొలి ఓట‌మి వైసీపీకి ఇక్క‌డే ద‌క్కుతుంద‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి.

ఫ‌లితంగా.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. ఏమాత్రం మేడా చింతించ‌లేదు. కార‌ణం.. ఎలానూ ఆయ‌న పార్టీని మారాల‌ని నిర్ణ‌యించుకున్నందునే. సో.. ఇప్పుడు ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ అయితే వ‌చ్చేసింది. గెలుపు కూడా రాసి పెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

This post was last modified on January 16, 2024 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago