Political News

ఆ ఎమ్మెల్యే… టీడీపీ టు టీడీపీ.. వ‌యా వైసీపీ… !

ఉమ్మ‌డి క‌డప జిల్లా రాజ‌కీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీల‌క‌మైన రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ.. తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేం దుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయ‌న టీడీపీ క‌డ‌ప‌కు చెందిన ముఖ్య నేత‌ను సంప్ర దించారు కూడా. వ‌చ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశిస్తున్నారు. దీనికి టీడీపీ అధిష్టానంకూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి.. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు. 2019లో ఆ పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, గ‌త రెండేళ్లుగా ఆయ‌న పార్టీతో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి కార‌ణం.. జిల్లా విభ‌జ‌న అంశం. ఇది ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఎఫెక్ట్ చూపించే అవ‌కాశం ఉంద‌ని మేడా న‌మ్ముతున్నారు. రాజంపేట‌ను కేంద్రంగా చేసుకుని అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటు చేయాల‌నేది ఇక్క‌డి వారి డిమాండ్‌.

కానీ, ప్ర‌భుత్వం మాత్రం రాజంపేట కాకుండా.. రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లా ఏర్పాటు చేసిం ది. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొన్ని రోజుల పాటు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌ర్నాలు నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఇదే విష‌యంపై మేడా కుటుంబం కూడా రెండుగా చీలిపోయి.. ఉద్య‌మాలు చేసింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం సెగ‌ను ముందుగానే గుర్తించిన ఎమ్మెల్యే మేడా.. ఇదే విష‌యాన్ని పార్టీకి చేర‌వేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న అప్ప‌టి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇదిలావుంటే.. త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో నారా లోకేష్‌… టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. రా యచోటిని మార్చి.. రాజంపేట‌ను కేంద్రంగా ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇది ఇక్క‌డి టీడీపీ సానుభూతిని పెంచింది. వాస్త‌వానికి క‌డ‌ప‌లో టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది కూడా ఒక‌టి. సో.. దీంతో ఇప్పుడు క‌డ‌ప‌లో తొలి ఓట‌మి వైసీపీకి ఇక్క‌డే ద‌క్కుతుంద‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి.

ఫ‌లితంగా.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. ఏమాత్రం మేడా చింతించ‌లేదు. కార‌ణం.. ఎలానూ ఆయ‌న పార్టీని మారాల‌ని నిర్ణ‌యించుకున్నందునే. సో.. ఇప్పుడు ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. మొత్తానికి ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ అయితే వ‌చ్చేసింది. గెలుపు కూడా రాసి పెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

This post was last modified on January 16, 2024 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago