Political News

సోనియా కాదు ప్రియాంకేనా?

రాబోయే ఎన్నికల్లో తెలంగాణా నుండి ప్రియాంక గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో సోనియాగాంధిని పోటీ చేయించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఏకగ్రీవ తీర్మానంచేసింది. మెదక్ లేకపోతే ఖమ్మం నుండి సోనియా పోటీచేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకనే సోనియా పోటీ విషయంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలకు కూడా పంపారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్టీలో ప్రియాంక గాంధి విషయమై బాగా చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీవర్గాలు అంటున్నాయి. సోనియా పోటీవిషయంలో తెరమీదకు వచ్చిన నియోజకవర్గాలే ఇపుడు ప్రియాంక విషయంలో కూడా చర్చల్లో నలుగుతున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు ఢిల్లీలో కలిసి పోటీచేయాలని ప్రియాంకను ఆహ్వానించారట. ఇదే విషయమై వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వే కూడా చేసినట్లు సమాచారం.

ఇపుడు విషయం ఏమిటంటే సోనియా ప్లేసులో రాబోయే ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. వయసు అయిపోవటం, తీవ్ర అనారోగ్యం కారణంగా సోనియా యాక్టివ్ పాలిటిక్స్ నుండి ఎప్పుడో తప్పుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప పబ్లిక్ అప్పీరెన్స్ ఉండటంలేదు. మొన్నటి తెలంగాణా ఎన్నికల సమయంలో కూడా అవసరార్ధం వచ్చారే కాని ఆరోగ్యం బాగుండి కాదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సోనియా అసలు పోటీయే చేయకపోవచ్చని పార్టీ నేతలంటున్నారు. ఇపుడు సోనియా ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాబట్టి ప్రియాంక ను పోటీచేసేందుకు ఒప్పించాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రియాంక గనుక పోటీకి అంగీకరిస్తే పార్టీకి రాష్ట్రంలో మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకపుడు మెదక్ నుండి ఇందిరాగాంధి పోటీచేసి గెలిచారు. అలాగే ఖమ్మంలో ఎక్కువసార్లు కాంగ్రెస్సే గెలిచింది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లలో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల గెలిచింది. దాంతో ఖమ్మంలో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి తల్లీ, కూతుళ్ళు ఏమిచేస్తారో చూడాలి. 

This post was last modified on January 16, 2024 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

29 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago