రాబోయే ఎన్నికల్లో తెలంగాణా నుండి ప్రియాంక గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో సోనియాగాంధిని పోటీ చేయించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఏకగ్రీవ తీర్మానంచేసింది. మెదక్ లేకపోతే ఖమ్మం నుండి సోనియా పోటీచేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకనే సోనియా పోటీ విషయంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలకు కూడా పంపారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్టీలో ప్రియాంక గాంధి విషయమై బాగా చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీవర్గాలు అంటున్నాయి. సోనియా పోటీవిషయంలో తెరమీదకు వచ్చిన నియోజకవర్గాలే ఇపుడు ప్రియాంక విషయంలో కూడా చర్చల్లో నలుగుతున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు ఢిల్లీలో కలిసి పోటీచేయాలని ప్రియాంకను ఆహ్వానించారట. ఇదే విషయమై వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వే కూడా చేసినట్లు సమాచారం.
ఇపుడు విషయం ఏమిటంటే సోనియా ప్లేసులో రాబోయే ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. వయసు అయిపోవటం, తీవ్ర అనారోగ్యం కారణంగా సోనియా యాక్టివ్ పాలిటిక్స్ నుండి ఎప్పుడో తప్పుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప పబ్లిక్ అప్పీరెన్స్ ఉండటంలేదు. మొన్నటి తెలంగాణా ఎన్నికల సమయంలో కూడా అవసరార్ధం వచ్చారే కాని ఆరోగ్యం బాగుండి కాదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సోనియా అసలు పోటీయే చేయకపోవచ్చని పార్టీ నేతలంటున్నారు. ఇపుడు సోనియా ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాబట్టి ప్రియాంక ను పోటీచేసేందుకు ఒప్పించాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రియాంక గనుక పోటీకి అంగీకరిస్తే పార్టీకి రాష్ట్రంలో మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకపుడు మెదక్ నుండి ఇందిరాగాంధి పోటీచేసి గెలిచారు. అలాగే ఖమ్మంలో ఎక్కువసార్లు కాంగ్రెస్సే గెలిచింది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లలో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల గెలిచింది. దాంతో ఖమ్మంలో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి తల్లీ, కూతుళ్ళు ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on January 16, 2024 12:31 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…