రాబోయే ఎన్నికల్లో తెలంగాణా నుండి ప్రియాంక గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో సోనియాగాంధిని పోటీ చేయించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఏకగ్రీవ తీర్మానంచేసింది. మెదక్ లేకపోతే ఖమ్మం నుండి సోనియా పోటీచేస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకనే సోనియా పోటీ విషయంలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలకు కూడా పంపారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్టీలో ప్రియాంక గాంధి విషయమై బాగా చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీవర్గాలు అంటున్నాయి. సోనియా పోటీవిషయంలో తెరమీదకు వచ్చిన నియోజకవర్గాలే ఇపుడు ప్రియాంక విషయంలో కూడా చర్చల్లో నలుగుతున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు ఢిల్లీలో కలిసి పోటీచేయాలని ప్రియాంకను ఆహ్వానించారట. ఇదే విషయమై వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వే కూడా చేసినట్లు సమాచారం.
ఇపుడు విషయం ఏమిటంటే సోనియా ప్లేసులో రాబోయే ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. వయసు అయిపోవటం, తీవ్ర అనారోగ్యం కారణంగా సోనియా యాక్టివ్ పాలిటిక్స్ నుండి ఎప్పుడో తప్పుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప పబ్లిక్ అప్పీరెన్స్ ఉండటంలేదు. మొన్నటి తెలంగాణా ఎన్నికల సమయంలో కూడా అవసరార్ధం వచ్చారే కాని ఆరోగ్యం బాగుండి కాదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సోనియా అసలు పోటీయే చేయకపోవచ్చని పార్టీ నేతలంటున్నారు. ఇపుడు సోనియా ఉత్తరప్రదేశ్ లోని అమేథి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాబట్టి ప్రియాంక ను పోటీచేసేందుకు ఒప్పించాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రియాంక గనుక పోటీకి అంగీకరిస్తే పార్టీకి రాష్ట్రంలో మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకపుడు మెదక్ నుండి ఇందిరాగాంధి పోటీచేసి గెలిచారు. అలాగే ఖమ్మంలో ఎక్కువసార్లు కాంగ్రెస్సే గెలిచింది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లలో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల గెలిచింది. దాంతో ఖమ్మంలో ప్రియాంక పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి తల్లీ, కూతుళ్ళు ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on January 16, 2024 12:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…