తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి కేసీయార్ రెడీ అవుతున్నారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఫిబ్రవరి 20 వ తేదీ నుండి కేసీయా టూర్ షెడ్యూల్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చిన రెండో రోజే బాత్ రూమ్ లో కేసీయార్ జారిపడ్డారు. అప్పుడు తుంటి ఎముక విరిగింది. ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. కేసీయార్ ప్రభుత్వం పూర్తి బెడ్ రెస్టులో ఉంటున్నారు.
బహుశా ఫిబ్రవరి 3వ వారానికి కేసీయార్ పూర్తి ఫిట్టుగా అయిపోతారేమో. అందుకనే 20వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించటానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. మెదక్ పార్లమెంటు నియోజవకర్గంలోని పరిధిలోనిగజ్వేలు నుండే పర్యటన మొదలవుతుందట. ముందుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారట. అంటే ఏకధాటిగా 17 బహిరంగ సభలు నిర్వహించటానికి పార్టీ షెడ్యూల్ ను పార్టీ రెడీ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఓటమిపై పార్టీలో సరైన సమీక్ష జరగలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీయార్ సమీక్షలు చేస్తున్నా గందరగోళం జరుగుతున్నాయి. సమీక్షలు జరుగుతున్నపుడు గెలిచిన వారు, ఓడిపోయిన వాళ్ళు కూడా కేసీయార్ పదేళ్ళ పరిపాలనలో జరిగిన అవకతవకలు, అరాచకాలు, ఎంఎల్ఏలకు ద్వితీయ శ్రేణినేతలకు, క్యాడర్ మధ్య బాగా గ్యాప్ వచ్చేయటం కూడా ఓటమికి కారణమని బహిరంగంగానే చెబుతున్నారు. సమీక్షల్లో ఇలాంటి అనేక చర్చల కారణంగా నేతలు, క్యాడర్ లో గందరగోళం పెరిగిపోతోంది.
పార్టీ నేతల్లో పెరిగిపోతున్న కారణంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నేతలు, క్యాడర్ ను ఒకదారిలోకి తీసుకురావటం కోసం కేసీయార్ రాష్ట్ర పర్యటనలు పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ గా కేసీయార్ పర్యటనలు, బహిరంగసభల ప్లాన్ జరుగుతోంది. ఫిబ్రవరి రెండోవారంలో బీఆర్ఎస్ భవన్ కు రాబోతున్నారట. వివిధ జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాల నేతల నుండి గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. పర్యటనల సందర్భంగానే అభ్యర్ధుల ప్రకటన కూడా ఉండచ్చని పార్టీవర్గాలు అంటున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on January 16, 2024 10:47 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…