Political News

అంబేడ్క‌ర్ మీద జ‌గ‌న్ ఆశ‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీ ఓటు బ్యాంకును మ‌రింత‌గా చేరువ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎస్సీలే కాదు.. మేధావి వ‌ర్గాన్ని, చ‌దువరుల‌ను కూడా వైసీపీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే .. ఆఘ‌మేగాల‌పై విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న పీడ‌బ్ల్యుడీ గ్రౌండ్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ నిలువెత్తు విగ్ర‌హాన్ని నిర్మించింది. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించారు.

ప్ర‌త్యేకంగా మంత్రుల క‌మిటీని నియ‌మించి మ‌రీ.. వైసీపీ అధినేత ఈ నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసు కున్నారు. మొత్తంగా విగ్ర‌హం ప్రారంభానికి రెడీ అయింది. ఈ నెల 19న అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కూడా చేప‌ట్ట‌నున్నారు. సీఎం జ‌గ‌న్ దాదాపు అర‌గంట‌కు పైగానే ఈ వేదిక నుంచి ప్ర‌సంగించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే..  గ్రామాల్లో సంబ‌రాలు కూడా చేప‌ట్టారు. ఒక‌వైపు సంక్రాంతి సంబ‌రాలు సాగుతుండ‌గా.. మ‌రోవైపు, అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి సంబంధించి అధికారికంగా వైసీపీ సంబ‌రాలు చేప‌ట్టింది.

ఈ సంద‌ర్బంగా వైసీపీ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చేస్తున్న మేళ్లు.. గ‌త ప్ర‌బు త్వం చేసిన వాటిని కూడా ఏక‌రువు పెడుతున్నారు. ప్ర‌దానంగా రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటికి అనుబందంగా 7 ఎస్టీ స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని టార్గెట్ చేయ‌డం ద్వారా.. గ‌తానికి భిన్నంగా.. మొత్తం స్థానాల్లో విజ‌యం ద‌క్కించు కోవాల‌నేది వైసీపీ వ్యూహంగా ఉంది. ఇక‌, పార్టీల‌ను వ్య‌తిరేకించేవారు.. లేదా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండేవారు కూడా.. స‌మాజంలో ఉన్నారు.

వీరిలో మేధావులు విద్యావంతులు, త‌ట‌స్థులు ఉన్నారు. రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకించే వారు కూడా.. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్‌ను మాత్రం విస్మ‌రించ‌రు.. దీనిని గుర్తించిన వైసీపీ ఇలాంటి వారిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలుచేస్తోంది. వీరితోనే అస‌లు చిక్కు ఉంద‌ని గ్ర‌హించిన పార్టీ.. అంబేడ్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు అనేక మంది మేధావులను.. ప్రొఫెస‌ర్ల‌ను కూడా ఆహ్వానిస్తోంది. త‌ద్వారా.. తాము అంద‌రికీ ఒక్క‌టేన‌న్న సంకేతాలు పంపించాల‌ని చూస్తోంది. మొత్తంగా చూస్తే.. అంబేడ్క‌ర్ విగ్ర‌హం ద్వారా.. వీరి ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌న్న వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా?  కాదా? అన్న‌ది చూడాలి.

This post was last modified on January 14, 2024 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…

54 minutes ago

వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!

మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…

1 hour ago

12 ఏళ్ళ రీమేక్ ఇప్పుడెందుకు స్వామి

నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…

1 hour ago

హైదరాబాద్ లో 9 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…

1 hour ago

శేఖర్ కమ్ముల కాంప్రోమైజ్ అవ్వట్లేదు

నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…

2 hours ago

ఈ ఎమ్మెల్యే నిజంగానే ‘వెండి’ కొండ

జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…

2 hours ago