వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఓటు బ్యాంకును మరింతగా చేరువ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒక్క ఎస్సీలే కాదు.. మేధావి వర్గాన్ని, చదువరులను కూడా వైసీపీ తనవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే .. ఆఘమేగాలపై విజయవాడ నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యుడీ గ్రౌండ్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించింది. దీనికి దాదాపు 400 కోట్ల రూపాయలను వెచ్చించారు.
ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించి మరీ.. వైసీపీ అధినేత ఈ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసు కున్నారు. మొత్తంగా విగ్రహం ప్రారంభానికి రెడీ అయింది. ఈ నెల 19న అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కూడా చేపట్టనున్నారు. సీఎం జగన్ దాదాపు అరగంటకు పైగానే ఈ వేదిక నుంచి ప్రసంగించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. గ్రామాల్లో సంబరాలు కూడా చేపట్టారు. ఒకవైపు సంక్రాంతి సంబరాలు సాగుతుండగా.. మరోవైపు, అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించి అధికారికంగా వైసీపీ సంబరాలు చేపట్టింది.
ఈ సందర్బంగా వైసీపీ అమలు చేస్తున్న పథకాలు.. ఎస్సీ సామాజిక వర్గానికి చేస్తున్న మేళ్లు.. గత ప్రబు త్వం చేసిన వాటిని కూడా ఏకరువు పెడుతున్నారు. ప్రదానంగా రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి అనుబందంగా 7 ఎస్టీ స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని టార్గెట్ చేయడం ద్వారా.. గతానికి భిన్నంగా.. మొత్తం స్థానాల్లో విజయం దక్కించు కోవాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. ఇక, పార్టీలను వ్యతిరేకించేవారు.. లేదా రాజకీయాలకు దూరంగా ఉండేవారు కూడా.. సమాజంలో ఉన్నారు.
వీరిలో మేధావులు విద్యావంతులు, తటస్థులు ఉన్నారు. రాజకీయాలను వ్యతిరేకించే వారు కూడా.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను మాత్రం విస్మరించరు.. దీనిని గుర్తించిన వైసీపీ ఇలాంటి వారిని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలుచేస్తోంది. వీరితోనే అసలు చిక్కు ఉందని గ్రహించిన పార్టీ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు అనేక మంది మేధావులను.. ప్రొఫెసర్లను కూడా ఆహ్వానిస్తోంది. తద్వారా.. తాము అందరికీ ఒక్కటేనన్న సంకేతాలు పంపించాలని చూస్తోంది. మొత్తంగా చూస్తే.. అంబేడ్కర్ విగ్రహం ద్వారా.. వీరి ఓట్లను తనవైపు తిప్పుకోవాలన్న వైసీపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? కాదా? అన్నది చూడాలి.
This post was last modified on January 14, 2024 6:55 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…