విజయవాడలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకవైపు.. టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తూ.. వైసీపీ నిర్ణయించింది. దీని నుంచి నాయకులు.. విజయవాడ రాజకీయాలు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు వైసీపీలో మరో దుమారం తెరమీదికి వచ్చిం ది. తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్ వైసీపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఆయన కమ్మ సామాజిక వర్గం నేత.
గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున బొప్పన పోటీ చేశారు. అయితే.. ఆయన గట్టి పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో ఓటమిపాలయ్యారు. దీనికి ముందు ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయినా.. తనకు ఛాన్స్ ఇవ్వాలనేది బొప్పన డిమాండ్ గా ఉంది. అయితే.. క్షేత్రస్థా యి పరిశీలను.. ప్రజల నాడి వంటివాటిని పరిగణనలోకి తీసుకున్న వైసీపీ ఇక్కడ నుంచి దేవినేని అవినాష్కు టికెట్ ఇచ్చింది. దీనిని బొప్పన జీర్ణించుకోలేకపోతున్నారు.
తనను కనీసం పట్టించుకోవడం లేదని, పార్టీలో తనకు ప్రాధాన్యంలేదని ఆయన చెబుతున్నారు. ప్రస్తు తం విజయవాడ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్గా బొప్పనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గాన్ని పార్టీ వైపు మళ్లించేందుకు, వారి ఓటు బ్యాంకును వైసీపీ కి అనుకూలంగా మార్చేందుకు బొప్పన సేవలు వినియోగించుకోవాలని వైసీపీ భావించింది. ఈ నేపథ్యంలోనే కీలకమైన విజయవాడ బాధ్యతలను అప్పగించింది. అయితే.. ఈ పదవిని పక్కన పెట్టయినా..త నకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని బొప్పన కోరుతున్నారు.
దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు బొప్పన టీడీపీవైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బొప్పనకు స్నేహితుడు, రాజకీయ ఆప్తుడు అయిన.. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన వెంటే.. బొప్పన కూడా అడుగులు వేస్తారని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. అంతో ఇంతో వైసీపీపై ప్రభావం పడడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…