ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయటం ఖాయమేనా ? అనే చర్చ పెరిగిపోతోంది. అదికూడా కడప ఎంపీగా పోటీచేయటానికి షర్మిల రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు ఆధారాలు ఏమిటంటే కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రెండురోజులుగా షర్మిల భేటీ అవుతున్నారట. ఈ భేటీల్లో కాంగ్రెస్ నేతలు, తటస్తులే కాకుండా కొందరు వైసీపీ చోటా నేతలు కూడా ఉన్నారని సమాచారం.
షర్మిల అడుగులు చూస్తుంటే కడప ఎంపీగా పోటీచేయటంపై బాగా ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. వైసీపీ తరపున అవినాష్ రెడ్డే పోటీచేయటం దాదాపు ఖాయంగా అనిపిస్తోంది. వివేకారెడ్డి హత్యలో నిందితుడిగా అవినాష్ పై ఆరోపణలున్నా ఎన్నికల్లో అదేమంత ప్రబావం చూపే అవకాశం ఉండదని అధికారపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ అవినాష్ నే మూడోసారి పోటీలోకి దింపుతారని టాక్ నడుస్తోంది.
సరిగ్గా ఈ పాయింట్ నే ఆధారం చేసుకుని షర్మిల కూడా ఎంపీగా పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే షర్మిల గనుక ఎంపీగా కడపలో పోటీచేస్తే అప్పుడు పోటీ రసవత్తరంగా ఉంటుందనటంలో సందేహంలేదు. బహుశా ఈ సీటును ప్రత్యేకంగా పరిగణించి టీడీపీ, జనసేన కూడా షర్మిలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్ దేనికవే పోటీచేస్తే ఓట్లు చీలిపోవటం ఖాయం. అప్పుడు అవినాషే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలా కాకుండా అవినాష్ గెలుపును అడ్డుకోవలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికను కంట్రోల్ చేయాలి. ఓట్లలో చీలిక రాకూడదంటే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మధ్య ఏదో స్ధాయిలో ఒప్పందం లేదా అవగాహన తప్పకుండా జరగాల్సిందే. అవినాష్ ఓటమిని పై మూడుపార్టీలు జగన్ ఓటమిగానే పరిగణిస్తున్నాయి. అందుకనే అవినాష్ కు వ్యతిరేకంగా పై మూడుపార్టీలు చేతులు కలపక తప్పదు. అదికూడా షర్మిల పోటీచేస్తే మాత్రమే. లేకపోతే ఏ పార్టీ దారి ఆ పార్టీదే.
This post was last modified on January 14, 2024 10:32 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…