వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు… స్టెప్పులు వేశారు. తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని పురస్కరించుకుని మంత్రి సొంత నియోజకవర్గం సత్తెనపల్లి లో కూడా భోగి మంటలు వేశారు. సత్తెనపల్లి గాంధీ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన భోగి మంటలను అంబటి రాంబాబు రాజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలతోపాటు.. చుట్టుపక్కల ఉన్న వారు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంబాబు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. పైగా.. తనపై రాయించుకున్న పాటకే ఆయన యువకులతో కలిసి స్టెప్పులు వేయడం అందిరినీ ఆకర్షించింది. అంబటీ రాంబాబు.. సంబరాల రాంబా బు పల్లవితో సాగే ఈ గీతానికి రాంబాబు స్టెప్పులు వేశారు. చివరిలో కరోనా సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నానంటూ.. పాట ముగుస్తుంది. కాగా.. ఈ కార్యక్రమంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాంబాబు పాల్గొన్నారు.
గత ఏడాది కూడా భోగి పండుగ సమయంలో ఎ స్టీ సామాజిక వర్గం లంబాడాలకు చెందిన మహిళలతో కలిసి రాంబాబు స్టెప్పులు వేశారు. అప్పట్లో ఆయనపై విపరీతమైన ట్రో్ల్స్ వచ్చాయి. అయినా.. వాటిని పాజిటివ్గా తీసుకున్న రాంబాబు.. ఇప్పుడు ఏకంగా సొంత పాట రాయించుకుని మరీ స్టెప్పులు వేయడం.. యువతను కూడా చేరదీయడం.. పక్కా ప్లాన్తో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం., ఎన్నికలకు ముందు ప్రజలను మెప్పించేందుకు రాంబాబు చేయాల్సిన ప్రయత్నాలు జోరుగానే చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…