వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు… స్టెప్పులు వేశారు. తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని పురస్కరించుకుని మంత్రి సొంత నియోజకవర్గం సత్తెనపల్లి లో కూడా భోగి మంటలు వేశారు. సత్తెనపల్లి గాంధీ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన భోగి మంటలను అంబటి రాంబాబు రాజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలతోపాటు.. చుట్టుపక్కల ఉన్న వారు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంబాబు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. పైగా.. తనపై రాయించుకున్న పాటకే ఆయన యువకులతో కలిసి స్టెప్పులు వేయడం అందిరినీ ఆకర్షించింది. అంబటీ రాంబాబు.. సంబరాల రాంబా బు పల్లవితో సాగే ఈ గీతానికి రాంబాబు స్టెప్పులు వేశారు. చివరిలో కరోనా సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నానంటూ.. పాట ముగుస్తుంది. కాగా.. ఈ కార్యక్రమంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాంబాబు పాల్గొన్నారు.
గత ఏడాది కూడా భోగి పండుగ సమయంలో ఎ స్టీ సామాజిక వర్గం లంబాడాలకు చెందిన మహిళలతో కలిసి రాంబాబు స్టెప్పులు వేశారు. అప్పట్లో ఆయనపై విపరీతమైన ట్రో్ల్స్ వచ్చాయి. అయినా.. వాటిని పాజిటివ్గా తీసుకున్న రాంబాబు.. ఇప్పుడు ఏకంగా సొంత పాట రాయించుకుని మరీ స్టెప్పులు వేయడం.. యువతను కూడా చేరదీయడం.. పక్కా ప్లాన్తో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం., ఎన్నికలకు ముందు ప్రజలను మెప్పించేందుకు రాంబాబు చేయాల్సిన ప్రయత్నాలు జోరుగానే చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 14, 2024 10:16 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…