ఢిల్లీలో రేవంత్ రెడ్డి బాగా బిజీబిజీగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటికే చాలాసార్లు రేవంత్ ఢిల్లీకి వచ్చారు. పార్టీ అగ్రనేతలు, అధిష్టానం ఢిల్లీలోనే ఉండటంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయక రేవంత్ కు తప్పటంలేదు. రేవంత్ అనే కాదు జాతీయపార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇది తప్పదు. అందుకనే అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే రేవంత్ కనీసం 15 రోజులు ఢిల్లీలోనే గడిపారు.
సరే ప్రస్తుత విషయానికి వస్తే రెండురోజులుగా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే క్యాంపేశారు. ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరిని రంగంలోకి దింపాలనే విషయాలను తెలంగాణా ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో పాటు వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్లమెంటు ఎన్నికలంటే జాతీయస్ధాయి అంశాలకు సంబందించినవి కాబట్టి హామీల విషయంలో తెలంగాణాకు ప్రత్యేకంగా ఇచ్చే హామీలేమీ ఉండవు.
అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎంత స్పీడుగా చర్యలు తీసుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో అంత సానుకూల ఫలితాలు వస్తాయని సునీల్ చెప్పారట. ఇప్పటికే సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని అమల్లోకి తెచ్చేశారు. మిగిలిన నాలుగు హామీలపైన కసరత్తు జరుగుతోంది. ఆ కసరత్తునే స్పీడు చేయాలని సునీల్ చెప్పారట. నెలన్నర రోజుల కాంగ్రెస్ పాలనలో జనాల స్పందన సానుకూలంగానే ఉందని సమావేశం హ్యాపీగా ఫీలైందని సమాచారం. అయితే ఇది సరిపోదు కాబట్టి అభ్యర్ధుల ఎంపీకలో జాగ్రత్తలు తీసుకోవాలని సునీల్ చెప్పారట.
నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికే సునీల్ సర్వేలను మొదలుపెట్టారట. ఆశావహుల జాబితాలను తయారుచేసి వాటిల్లో నుండి వడపోత మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సర్వే వివరాలతో రేవంత్ ఆలోచనలను కూడా విశ్లేషిస్తున్నారు. అన్నింటినీ కలిపి తొందరలోనే అభ్యర్ధులను ప్రకటిస్తే ఎన్నికల్లో గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమావేశం అభిప్రాయపడింది. ఇదే విషయాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధి, రాహూల్ గాంధి, ప్రియాంకగాంధీలతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. దాంతో ప్రచారానికి ప్రియాంకను తెలంగాణాకు తీసుకురావాలని ప్లాన్ జరుగుతోంది. భారత్ జోడోయాత్ర రెండో విడత మొదలైన కారణంగా రాహూల్ ఏమిచేస్తారో చూడాలి.
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…