వైసీపీ ఎమ్మెల్యే, పిఠాపురం నాయకుడు పెండెం దొరబాబు దారెటు? ఆయన ఏ పార్టీలో చేరనున్నారు? ఇదీ.. ఇప్పుడు నియోజకవర్గం సహా.. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న భారీ చర్చ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం దొరబాబుకు టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ టికెట్ను ఎంపీ వంగా గీతకు కేటాయించారు. టికెట్ కోసం దొరబాబు ఎంతో ప్రయత్నించినా.. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలే దు.
వైసీపీ అధిష్టానం ఎంపీ గీతవైపు మొగ్గు చూపింది. దీంతో ఇప్పుడు దొరబాబు తన దారి తాను చూసుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి రిజైన్ చేయడం.. అదేవిధంగా ఎమ్మెల్యే పదవిని వదులు కొవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీల వైపు కూడా చూస్తున్నారు. గతంలో బీజేపీ తరఫున ఒకసారి విజయందక్కించుకున్న పెండెం దొరబాబు.. తర్వాత గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు.
2004లో బీజేపీ తరఫున దొరబాబు విజయం సాధించారు. తర్వాత.. 2009లో వంగా గీత అప్పటి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇక్కడ విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. 2014లో వైసీపీ దొరబాబుకు టికెట్ ఇచ్చినా.. ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక, 2019లో విజయం మాత్రం విజయం సాధించారు. అంటే.. దీనిని బట్టి దొరబాబుకు మంచి కేడర్ ఉంది. అదేసమయంలో వంగా గీతకు కూడా ఇక్కడ గెలిచిన హిస్టరీ ఉండడంతో తను ఏదో విధంగా పోటీ చేయాలనేది దొరబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
టీడీపీలో లేదా.. జనసేనలో ఆయన చేరే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన తేల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవ ర్గంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ రోజు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెప్పుకొంటున్నారు. జనసేనలో చేరితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే చర్చ కూడా ఉంది. అయితే.. ఇదే టికెట్ నుంచి జనసేన అధినేత పవన్ స్వయంగా బరిలో నిలిచే అవకాశం ఉందని కొన్నాళ్లుగా చర్చజరుగుతున్న నేపథ్యంలో దొరబాబుకు అవకాశం ఉంటుందా? అనేది చర్చగా మారింది.
This post was last modified on January 14, 2024 2:33 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…