Political News

వైసీపీ వ్యూహం… రాజ‌కీయ మేధావుల‌కు సైతం మైండ్ బ్లాంక్‌

“వైసీపీ అంటే కేవ‌లం పార్టీనే కాదు.. అదొక సోష‌ల్ ఇంజ‌నీరింగ్ డిపార్ట్‌మెంట్ బ్రో!!”- అంటున్నారు రాజ కీయ మేధావులు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ఎలాంటి శ‌ష‌భిష‌లు లేకుం డా.. వ్యూహాత్మ‌కంగా స్థానాలు మార్చేసిన తీరు.. రాజ‌కీయంగా సంచ‌ల‌నాల‌కు వేదిక అయింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన స్థానాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.

నిజానికి ఇంత పెద్ద స్థాయిలో మార్పులు ఉంటాయ‌ని.. వైసీపీనేత‌లు కూడా ఊహించ‌లేదు. తొలిసారి 11, త‌ర్వాత 24, ఇప్పుడు 21 స్థానాల‌కు సంబంధించి ఇంచార్జ్‌ల‌ను మార్పు, చేర్పులు చేయ‌డం.. కీల‌క‌మైన ఓసీ స్థానాల‌కు కూడా బీసీ, మైనారిటీ నేత‌ల‌కు అప్ప‌గించ‌డం.. కొత్త ముఖాల‌ను ప‌రిచ‌యం చేయ‌డం వంటివి వైసీపీ రాజ‌కీయాల‌కు హైలెట్‌గా నిలిచాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు 50+ స్తానాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.

అయితే.. మ‌రిన్ని స్థానాల్లోనూ మార్పులు ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపు రంలో చేసిన మార్పు.. అత్యంత అనూహ్యంగా ఉంద‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు. అదేవిధంగా రాయ దుర్గం, మ‌ద‌న‌ప‌ల్లె, ఏలూరు పార్ల‌మెంటు స్థానాల్లో మార్పుల‌ను గ‌తంలో ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇది చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రిగిన మార్పుగానే చెబుతున్నారు. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ద‌క్కించు కుని తీరాల‌ని నిర్ణ‌యించుకున్న వైసీపీ.. ఇలా సంచ‌ల‌నాల‌కు వేదిక కావ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం.. తాజా జాబితాలో ఇద్ద‌రు బీసీ మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశారు. మొత్తంగా చూస్తే.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ దిశ‌గా వైసీపీ అడుగులు వేసింది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మయం ఉండ‌డం.. రాజ‌కీయంగా కొత్త‌నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం.. జెడ్పీ చైర్మ‌న్‌ల‌ను తీసుకువ‌చ్చి అసెంబ్లీ బ‌రిలో నిల‌బెట్ట‌డం.. అనూహ్యంగా అసెంబ్లీ స్థానాల‌కు ఎంపీల‌ను నిల‌బెట్ట‌డం.. వంటి ప‌రిణామాలు.. వైసీపీ సామాజిక కోణంలో చేసిన‌ట్టుగానే చ‌ర్చ సాగుతోంది. రాజ‌కీయంగానే కాకుండా.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ లోనూ.. వైసీపీని భిన్న‌మైన పొలిటిక‌ల్ పార్టీగా నిల‌బెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

This post was last modified on January 14, 2024 2:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

2 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

7 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

9 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

13 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

14 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

14 hours ago