“వైసీపీ అంటే కేవలం పార్టీనే కాదు.. అదొక సోషల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బ్రో!!”- అంటున్నారు రాజ కీయ మేధావులు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎలాంటి శషభిషలు లేకుం డా.. వ్యూహాత్మకంగా స్థానాలు మార్చేసిన తీరు.. రాజకీయంగా సంచలనాలకు వేదిక అయింది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.
నిజానికి ఇంత పెద్ద స్థాయిలో మార్పులు ఉంటాయని.. వైసీపీనేతలు కూడా ఊహించలేదు. తొలిసారి 11, తర్వాత 24, ఇప్పుడు 21 స్థానాలకు సంబంధించి ఇంచార్జ్లను మార్పు, చేర్పులు చేయడం.. కీలకమైన ఓసీ స్థానాలకు కూడా బీసీ, మైనారిటీ నేతలకు అప్పగించడం.. కొత్త ముఖాలను పరిచయం చేయడం వంటివి వైసీపీ రాజకీయాలకు హైలెట్గా నిలిచాయని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు 50+ స్తానాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.
అయితే.. మరిన్ని స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపు రంలో చేసిన మార్పు.. అత్యంత అనూహ్యంగా ఉందనే చెబుతున్నారు పరిశీలకులు. అదేవిధంగా రాయ దుర్గం, మదనపల్లె, ఏలూరు పార్లమెంటు స్థానాల్లో మార్పులను గతంలో ఎవరూ ఊహించలేదు. ఇది చాలా వ్యూహాత్మకంగా జరిగిన మార్పుగానే చెబుతున్నారు. పైగా.. వచ్చే ఎన్నికల్లో విజయాన్ని దక్కించు కుని తీరాలని నిర్ణయించుకున్న వైసీపీ.. ఇలా సంచలనాలకు వేదిక కావడం గమనార్హం.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. తాజా జాబితాలో ఇద్దరు బీసీ మహిళలకు పెద్దపీట వేశారు. మొత్తంగా చూస్తే.. సోషల్ ఇంజనీరింగ్ దిశగా వైసీపీ అడుగులు వేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం.. రాజకీయంగా కొత్తనేతలకు అవకాశం కల్పించడం.. జెడ్పీ చైర్మన్లను తీసుకువచ్చి అసెంబ్లీ బరిలో నిలబెట్టడం.. అనూహ్యంగా అసెంబ్లీ స్థానాలకు ఎంపీలను నిలబెట్టడం.. వంటి పరిణామాలు.. వైసీపీ సామాజిక కోణంలో చేసినట్టుగానే చర్చ సాగుతోంది. రాజకీయంగానే కాకుండా.. సోషల్ ఇంజనీరింగ్ లోనూ.. వైసీపీని భిన్నమైన పొలిటికల్ పార్టీగా నిలబెడుతోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 14, 2024 2:18 am
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…