Political News

క‌మ్మ వ‌ర్సెస్ బీసీ.. జ‌గ‌న్ ఫార్ములా ఇది..!

రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అవి కూడా పార్ల‌మెంటు స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేసిన మార్పులు.. రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అవే.. ఒక‌టి ఏలూరు పార్ల‌మెంటు స్థానం, రెండు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌స్తుతం క‌మ్మ నేత‌ల చేతిలోనే ఉన్నాయి. విశాఖ ఎంపీగా.. వైసీపీ నాయ‌కుడు ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. ఈయ‌న క‌మ్మ వర్గానికి చెందిన నాయ‌కుడు. తొలిసారి టికెట్ తీసుకుని గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఏలూరు నుంచి కూడా క‌మ్మ వ‌ర్గానికే చెందిన కోట‌గిరి శ్రీధ‌ర్ ఎంపీ గా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌కు సొంత కేడ‌ర్ నుంచే అస‌మ్మ‌తి సెగ రావ‌డంతో ప‌క్క‌న పెట్టార‌నే చ‌ర్చ ఉంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఆయా జిల్లాల్లోనే కాదు.. రాజకీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నాలుగు ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. బీసీల‌కు ఇక్క‌డ ఛాన్స్ లేదు. గ‌తంలో ఏలూరు నుంచి మాగంటి బాబు(క‌మ్మ‌) ప్రాతినిధ్యం వ‌హించారు. త‌ర్వాత‌.. ఇదే సామాజిక వ‌ర్గం నేత కోట‌గిరి ఇక్క‌డి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వ‌ర్గం యాద‌వ కులానికి చెందిన కారుమూరి సునీల్‌కు వైసీపీ టికెట్ ఇచ్చేసింది.

ఇక‌, విశాఖ‌లోనూ కొన్ని ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. గ‌తంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ కూడా.. క‌మ్మ‌ల కే ప్రాధాన్యం ఇచ్చాయి. కాంగ్రెస్ నుంచి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి విజ‌యం ద‌క్కించుకోగా.. బీజేపీ నుంచి కంభంపాటి హ‌రిబాబు విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. వైసీపీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గానికే టికెట్ ఇచ్చింది.

ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు బీసీ నాయ‌కురాలు.. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డంతోపాటు.. బీసీల‌కు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు టీడీపీ ఎలాంటి అడుగులు వేస్తుంద‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Satya

Recent Posts

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…

1 hour ago

3 రోజులుగా పార్టీ ఆపీస్ లోనే మాజీ ఎంపీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…

1 hour ago

పరీక్షల వలయంలో పెద్ది ప్రయాణం

పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…

2 hours ago

రోడ్డు పక్కన నిలబడి ఆకర్షిస్తే.. ఏం జరుగుతుంది?

శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…

4 hours ago

పుష్ప-3… నమ్మొచ్చా?

పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్‌గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…

5 hours ago

తెలంగాణలో అదనపు రేట్లు… ఇక కలేనా?

ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…

6 hours ago