Political News

చంద్రబాబుతో షర్మిల భేటీ!

కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైనం చర్చనీయాంశమైంది. తన అన్న జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు షర్మిల విషెస్ చెప్పడం సంచలనం రేపింది. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో షర్మిల భేటీ అయ్యారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి షర్మిల వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని బాబు కుటుంబాన్ని షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబుకు షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రిక స్వయంగా ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రబాబును షర్మిల కలవడం ఇదే మొదటిసారి. షర్మిలను చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆహ్వానించారని, చంద్రబాబు కూడా హాజరై తమను ఆశీర్వదించారని షర్మిల అన్నారు. ఆ సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తూ తన కుమారుడి పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించానని, అందులో వింత, విచిత్రం ఏమీ లేదని చెప్పారు. వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని తనతో చంద్రబాబు గుర్తు చేసుకున్నారని అన్నారు. తమ భేటీని స్నేహపూర్వకంగానే చూడాలని అన్నారు. తెలంగాణ అయినా, ఏపీ అయినా..కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఎక్కడ అప్పగించినా వెళతానని అన్నారు.

This post was last modified on January 13, 2024 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

37 seconds ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

1 hour ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

3 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago