Categories: Political News

విజ‌య‌వాడ‌పై చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. పార్టీకి గుడ్ బై చెప్ప‌డం.. ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. తెలిసిందే. ఇక‌, తాజాగా వైసీపీ విడుద‌ల చేసిన మూడో జాబితాలో కేశినేని పేరు కూడా ఉండ‌డంతో ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని వ‌దులుకునేందుకు వీల్లేకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు.

వ‌రుస‌గా.. టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి మ‌ళ్లినా.. 2014లో మాత్రం విజ‌య‌వాడ‌లో టీడీపీకి అండ‌గా నిలిచారు. అదేవిధంగా వైసీపీ గాలులు బ‌లంగా వీచిన 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా టీడీపీకి తిరుగులేద‌నే సంకేతాలు ఇవ్వాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ఉన్నారు.

ఈ క్ర‌మంలో అనూహ్యంగా కేశినేని నాని తిరుగు బాటు చేయ‌డం.. వైసీపీలోకి వెళ్ల‌డంతో పాటు 60 శాతం మంది నాయ‌కుల‌ను లాగేస్తాన‌ని కూడా చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. దీనిని త‌ట్టుకునేందుకు.. టీడీపీని మ‌రోసారి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు నంద‌మూరి కుటుంబానికి చెందిన సుహాసినిని ఇక్క‌డ‌కు తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విష‌యం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే జ‌రిగితే.. నంద‌మూరి అభిమానులు.. పార్టీ శ్రేణులు కూడా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో తెలంగాణ‌లో పోటీ చేసిన సుహాసిని అక్కడ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. కానీ, ఏపీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయ‌లేదు. దీంతో ఆమెను ఇక్క‌డ‌కు తీసుకురావ‌డం ద్వారా.. బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇవీ.. బ‌లాబ‌లాలు..

నంద‌మూరి కుటుంబం అనే సెంటిమెంటు సుహాసినికి బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. అదేవిధంగా విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి గ‌త 20 ఏళ్ల‌లో పోటీ చేసే మ‌హిళా అభ్య‌ర్థిగా కూడా ఆమె రికార్డు ఎక్క‌నుంది. అదేవిధంగా టీడీపీలోని అంత‌ర్గ‌త విభేదాలు.. నాయ‌కుల మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యలేమి వంటివి కూడా స‌మ‌సి పోయే అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Satya

Recent Posts

వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…

47 minutes ago

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

4 hours ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

6 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

10 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

12 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

14 hours ago