విజ‌య‌వాడ‌పై చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. పార్టీకి గుడ్ బై చెప్ప‌డం.. ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. తెలిసిందే. ఇక‌, తాజాగా వైసీపీ విడుద‌ల చేసిన మూడో జాబితాలో కేశినేని పేరు కూడా ఉండ‌డంతో ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని వ‌దులుకునేందుకు వీల్లేకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు.

వ‌రుస‌గా.. టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి మ‌ళ్లినా.. 2014లో మాత్రం విజ‌య‌వాడ‌లో టీడీపీకి అండ‌గా నిలిచారు. అదేవిధంగా వైసీపీ గాలులు బ‌లంగా వీచిన 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా టీడీపీకి తిరుగులేద‌నే సంకేతాలు ఇవ్వాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ఉన్నారు.

ఈ క్ర‌మంలో అనూహ్యంగా కేశినేని నాని తిరుగు బాటు చేయ‌డం.. వైసీపీలోకి వెళ్ల‌డంతో పాటు 60 శాతం మంది నాయ‌కుల‌ను లాగేస్తాన‌ని కూడా చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. దీనిని త‌ట్టుకునేందుకు.. టీడీపీని మ‌రోసారి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు నంద‌మూరి కుటుంబానికి చెందిన సుహాసినిని ఇక్క‌డ‌కు తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విష‌యం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే జ‌రిగితే.. నంద‌మూరి అభిమానులు.. పార్టీ శ్రేణులు కూడా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో తెలంగాణ‌లో పోటీ చేసిన సుహాసిని అక్కడ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. కానీ, ఏపీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయ‌లేదు. దీంతో ఆమెను ఇక్క‌డ‌కు తీసుకురావ‌డం ద్వారా.. బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇవీ.. బ‌లాబ‌లాలు..

నంద‌మూరి కుటుంబం అనే సెంటిమెంటు సుహాసినికి బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. అదేవిధంగా విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి గ‌త 20 ఏళ్ల‌లో పోటీ చేసే మ‌హిళా అభ్య‌ర్థిగా కూడా ఆమె రికార్డు ఎక్క‌నుంది. అదేవిధంగా టీడీపీలోని అంత‌ర్గ‌త విభేదాలు.. నాయ‌కుల మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యలేమి వంటివి కూడా స‌మ‌సి పోయే అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on January 12, 2024 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

57 minutes ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

2 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

2 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

3 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

3 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago