విజ‌య‌వాడ‌పై చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. పార్టీకి గుడ్ బై చెప్ప‌డం.. ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. తెలిసిందే. ఇక‌, తాజాగా వైసీపీ విడుద‌ల చేసిన మూడో జాబితాలో కేశినేని పేరు కూడా ఉండ‌డంతో ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని వ‌దులుకునేందుకు వీల్లేకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు.

వ‌రుస‌గా.. టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి మ‌ళ్లినా.. 2014లో మాత్రం విజ‌య‌వాడ‌లో టీడీపీకి అండ‌గా నిలిచారు. అదేవిధంగా వైసీపీ గాలులు బ‌లంగా వీచిన 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా టీడీపీకి తిరుగులేద‌నే సంకేతాలు ఇవ్వాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ఉన్నారు.

ఈ క్ర‌మంలో అనూహ్యంగా కేశినేని నాని తిరుగు బాటు చేయ‌డం.. వైసీపీలోకి వెళ్ల‌డంతో పాటు 60 శాతం మంది నాయ‌కుల‌ను లాగేస్తాన‌ని కూడా చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. దీనిని త‌ట్టుకునేందుకు.. టీడీపీని మ‌రోసారి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు నంద‌మూరి కుటుంబానికి చెందిన సుహాసినిని ఇక్క‌డ‌కు తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విష‌యం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే జ‌రిగితే.. నంద‌మూరి అభిమానులు.. పార్టీ శ్రేణులు కూడా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో తెలంగాణ‌లో పోటీ చేసిన సుహాసిని అక్కడ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. కానీ, ఏపీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయ‌లేదు. దీంతో ఆమెను ఇక్క‌డ‌కు తీసుకురావ‌డం ద్వారా.. బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇవీ.. బ‌లాబ‌లాలు..

నంద‌మూరి కుటుంబం అనే సెంటిమెంటు సుహాసినికి బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. అదేవిధంగా విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి గ‌త 20 ఏళ్ల‌లో పోటీ చేసే మ‌హిళా అభ్య‌ర్థిగా కూడా ఆమె రికార్డు ఎక్క‌నుంది. అదేవిధంగా టీడీపీలోని అంత‌ర్గ‌త విభేదాలు.. నాయ‌కుల మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యలేమి వంటివి కూడా స‌మ‌సి పోయే అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on January 12, 2024 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago