Categories: Political News

విజ‌య‌వాడ‌పై చంద్ర‌బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌

విజ‌య‌వాడ రాజ‌కీయాల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని.. పార్టీకి గుడ్ బై చెప్ప‌డం.. ఆ వెంట‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. తెలిసిందే. ఇక‌, తాజాగా వైసీపీ విడుద‌ల చేసిన మూడో జాబితాలో కేశినేని పేరు కూడా ఉండ‌డంతో ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని వ‌దులుకునేందుకు వీల్లేకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు.

వ‌రుస‌గా.. టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. వైసీపీకి మ‌ళ్లినా.. 2014లో మాత్రం విజ‌య‌వాడ‌లో టీడీపీకి అండ‌గా నిలిచారు. అదేవిధంగా వైసీపీ గాలులు బ‌లంగా వీచిన 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా టీడీపీకి తిరుగులేద‌నే సంకేతాలు ఇవ్వాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ఉన్నారు.

ఈ క్ర‌మంలో అనూహ్యంగా కేశినేని నాని తిరుగు బాటు చేయ‌డం.. వైసీపీలోకి వెళ్ల‌డంతో పాటు 60 శాతం మంది నాయ‌కుల‌ను లాగేస్తాన‌ని కూడా చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. దీనిని త‌ట్టుకునేందుకు.. టీడీపీని మ‌రోసారి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు నంద‌మూరి కుటుంబానికి చెందిన సుహాసినిని ఇక్క‌డ‌కు తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విష‌యం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే జ‌రిగితే.. నంద‌మూరి అభిమానులు.. పార్టీ శ్రేణులు కూడా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో తెలంగాణ‌లో పోటీ చేసిన సుహాసిని అక్కడ బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. కానీ, ఏపీలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయ‌లేదు. దీంతో ఆమెను ఇక్క‌డ‌కు తీసుకురావ‌డం ద్వారా.. బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇవీ.. బ‌లాబ‌లాలు..

నంద‌మూరి కుటుంబం అనే సెంటిమెంటు సుహాసినికి బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. అదేవిధంగా విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి గ‌త 20 ఏళ్ల‌లో పోటీ చేసే మ‌హిళా అభ్య‌ర్థిగా కూడా ఆమె రికార్డు ఎక్క‌నుంది. అదేవిధంగా టీడీపీలోని అంత‌ర్గ‌త విభేదాలు.. నాయ‌కుల మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యలేమి వంటివి కూడా స‌మ‌సి పోయే అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Satya

Recent Posts

బ్యాన్ వల్లే ఎక్కువ మంది చూసారా?

సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…

33 minutes ago

కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…

38 minutes ago

దర్శకత్వాన్ని పంచుకుంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…

3 hours ago

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…

4 hours ago

పెళ్లి కాలేదు… పిల్లల కోసం హీరోయిన్ ఏం చేసింది?

బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న…

7 hours ago

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

7 hours ago