వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో తాను బెజవాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రముఖ పారివ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి(సత్యనారాయణ) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానన్నారు. పార్టీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడలో ఏ స్తానం నుంచి అయినా.. పోటీకి రెడీగా ఉన్నట్టు బీజేపీ అధిష్టానానికి సైతం చెప్పినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు సుజనా చౌదరి తెలిపారు. అయితే.. బీజేపీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంటుందనేది తనకు తెలియదని.. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాస్ట్రాలపైనా బీజేపీ ఫోకస్ పెంచిందని, త్వరలోనే ఏపీ రాజకీయాలపైనా దృష్టి పెడుతుందని సుజనా వ్యాఖ్యానించారు.
అప్పుడు పొత్తుల విషయాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని సుజనా చెప్పారు. విజయవాడ నుంచి పోటీ చేస్తే. తాను గెలిచి కానుకగా ఇస్తానని చౌదరి వ్యాఖ్యానించారు. దాదాపు పార్లమెంటు ఎన్నికలపైనే తన దృష్టి ఉంటుందని సుజనా చెప్పుకొచ్చారు.
అమరావతికే జై!
వ్యక్తిగతంగా తాను ఏపీ రాజధాని అమరావతినే కోరుకుంటున్నట్టు సుజనా చౌదరి చెప్పారు. రాజకీయంగా చూసుకున్నా.. బీజేపీ కూడా అమరావతికి మద్దతు ప్రకటించిదని.. రెండో దశ రైతుల ఉద్యమానికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపి.. ఉద్యమంలో పాలు పంచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రతి ఒక్కరూ రాజధాని అమరావతినే కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఎన్నికల విషయంపై మాట్లాడుతూ.. ఏపీలో జరగనున్న ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని, ఇటీవల విజయవాడ వచ్చిన సీఈసీకి బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్టు సుజనా వ్యాఖ్యానించారు.
This post was last modified on January 12, 2024 2:35 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…