ఏపీలో మరో రెండు మాసాల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ రెండే కాదు.. ఇప్పుడు మరో ఎన్నిక కూడా తెరమీదికి వచ్చింది. అదే రాజ్యసభ ఎన్నికలు. మొత్తం 3 స్థానాలకు ఈ సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే.. ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విషయం మాత్రమే రాజకీయంగా ప్రాధాన్యం ఉంది.
కానీ, ఇదేసమయంలో చాపకింద నీరులా.. మూడు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడలోనే ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు.. ఈ విషయంపైనా దృష్టి పెట్టారు. వైసీపీకి చెందిన ఒకరు, టీడీపీకి చెందిన మరొకరు.. టీడీపీ తరపున టికెట్ సొంతం చేసుకుని తర్వాత బీజేపీ బాటపట్టిన మరొకరు కూడా ఏప్రిల్ మాసాంతానికి రిటైర్ కానున్నారు, వారే.. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి(వైసీపీ), కనకమేడల రవీంద్రకుమార్(టీడీపీ), సీఎం రమేష్(టీడీపీ నుంచి బీజేపీ)లు ఉన్నారు.
ఈ మూడు ఎన్నికలు కూడా.. నామినేటెడ్ కాదు. నేరుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఎన్నుకుంటారు. దీంతో ఈ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు మించి ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న వైసీపీ ఈ మూడు దక్కిం చుకునే అవకాశం ఉంది. కానీ, రాష్ట్రంలో మారిన సమీకరణలు.. రాజకీయ వైరాల నేపథ్యంలో టీడీపీ కూడా బలంగానే పోరాడేందుకు రెడీ అయింది.
కనీసం ఒక్కస్థానాన్నయినా.. తాము దక్కించుకుంటామని తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు ఎనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అంటే. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన క్రాస్ ఓటింగ్ కారణంగా.. టీడీపీ విజయం దక్కించుకున్నట్టుగానే .. ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. ప్రస్తుతంటికెట్ దక్కని వారు.. చాలా మంది వైసీపీలో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో వారంతా .. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి లోపాయికారీ మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక, ఈ విషయాన్ని పసిగట్టిన వైసీపీ తన వారిని రెబల్స్గా మారకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. మొత్తంగానికి అసెంబ్లీ-పార్లమెంటుతో పాటు రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో సెగలు పుట్టిస్తుండడం గమనార్హం.
This post was last modified on January 11, 2024 10:43 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…