Political News

మాగుంట‌కు లైన్ క్లియ‌ర్‌.. కానీ, పెద్ద టార్గెట్ పెట్టారా..!

నిన్న మొన్నటి వ‌ర‌కు తీవ్ర ర‌స‌కందాయంలో ఉన్న‌ ఒంగోలు ఎంపీ టికెట్ పై స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన అనంతరం పార్టీ అధిష్టానం మాగుంటకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయ‌న కుమారుడికి కాకుండా.. మాగుంట‌నే ఈ ద‌ఫా పోటీ చేయాల‌ని ఆదేశించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. మాగుంట వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికె ట్ ఉండ‌బోద‌ని, ఆయ‌న పార్టీ మార్పుదిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని ఓ వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేసింది. మ‌రీ ముఖ్యంగా పార్టీ మార్పు త‌థ్య‌మ‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే.. టికెట్ల పై అసంతృప్తితో ఉన్న నాయ‌కుల‌ను బుజ్జగిస్తున్న సీఎం జ‌గ‌న్ ఈ ప‌రంపర‌లోనే మాగుంట‌కు కూడా క‌బురు పెట్టి.. ఆయ‌న‌తో చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో మాగుంట కుమారుడికి ఇప్పుడు కాద‌ని.. ప్ర‌స్తుతం నెల‌కొన్న పోటీ నేప‌థ్యంలో శ్రీనివాసుల రెడ్డినే పోటీచేయాల‌ని సీఎం జ‌గ‌న్ చెప్పినట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, దీంతో పాటు.. ప్ర‌కాశం జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను సైతం ద‌త్త‌త తీసుకుని అక్క‌డ వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని పెద్ద టార్గెట్ పెట్టార‌ని తెలిసింది. దీనికి మాగుంట అంగీక‌రించార‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఒంగోలు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాగంటకు ఈద‌ఫా ఎన్నిక‌లు అత్యంత కీల‌కం.

ఇదిలావుంటే.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షం టీడీపీకి ఇక్క‌డ .. బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం గాలింపు ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మాగుంట పార్టీ మార్పుపై వార్త‌లు రావ‌డం.. ఆ వెంట‌నే టీడీపీలోకివెళ్తార‌ని ప్ర‌చారం జ‌ర‌గడం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మాగుంట వైసీపీలోనే ఉండనున్న నేప‌థ్యంలో టీడీపీకి ఎవ‌రికి ఇక్క‌డ టికెట్ ఇస్తుంద‌నేదిఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు శిద్దా రాఘ‌వ‌రావు ఇక్క‌డ నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on January 11, 2024 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

57 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago