Political News

వైసీపీలో మరో వికెట్..ఎంపీ సంజీవ్ గుడ్ బై

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరికి జగన్ స్థానచలనం కల్పిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో అసమ్మతి రాగం తీవ్రంగా వినిపిస్తోంది. చాలామంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉండగా..మరికొందరు జనసేన, టీడీపీ, కాంగ్రెస్ లో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్ బై చెప్పారు.

ఎంపీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు. 2 రోజుల్లోనే స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. అయితే, ఏ పార్టీలో చేరాలన్న సంగతి నిర్ణయించుకోలేదని వెల్లడించారు. సీఎం జగన్ ను కలిసేందుకు ఫోన్ చేశానని, కానీ అది రిసీవ్ చేసుకోలేదని సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెబుతుంటారుని, కానీ, చేతల్లో అది అమలు కాదని సంజీవ్ కుమార్ ఆరోపించారు.

రాబోయే ఎన్నికలలో కర్నూలు లోక్ సభ టికెట్ ను మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారని, ఈ నేపథ్యంలోనే సంజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా, సంజీవ్ కుమార్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ కోరగా…ఆయన నేరుగా జగన్ కే నో చెప్పారు. దీంతో, ఆయన స్థానంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారట. దీంతో, లావు టీడీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలున్నాయిన తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి మూడో జాబితా విడుదల కాగానే మరిన్ని వికెట్లు పడతాయని టాక్ వస్తోంది.

This post was last modified on January 10, 2024 6:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

2 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

3 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

4 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago