ఏ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అయినా తాను సిద్ధమేనని తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఇటీవల టికెట్ దక్కదని తెలిసిన తర్వాత.. తీవ్ర విమర్శలు గుప్పించిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే.. తాజాగా మంగళవారం ఆయన ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కలిశారు. ఆయన పాదాలపై కూడా పడ్డారు.
దీంతో కాపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితిలో లేకపోవడం.. వెళ్లినా పరాభవం తప్పదని నిర్ణయించుకున్న దరిమిలా.. కాపు వారి ఆఫర్ మారింది. ఏ పార్టీ అయినా.. అంటూ ఆయన దీర్ఘాలు తీశారు. ఇక, ఆయన పరిస్థితిని గమనిస్తే.. స్థానికంగా మంచి పలుకుబడి ఉన్నప్పటికీ.. అంతేస్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి. రాయదుర్గంలో టీడీపీ బలంగా ఉంది.
ఇక్కడ నుంచి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పోటీ ఖాయంగా ఉంది. ఆయన గెలుపుపై సైకిల్ పార్టీకి భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపు వస్తామన్నా.. పార్టీ చేర్చుకునే అవకాశం లేదు. ఇక, జనసేనలోకి వెళ్లాలన్నా.. పొత్తు ఉన్న టీడీపీ టికెట్ ఇచ్చేందుకు అవకాశం లేదు. అయితే.. కళ్యాణదు్ర్గం టికెట్ను కూడా ఆశిస్తున్నందున.. అక్కడ పరిశీలించే అవకాశం ఉంది. కానీ.. ఇప్పటికే కళ్యాణదుర్గంలో ఉన్న టీడీపీనాయకులు టికెట్ కోసం కుస్తీలు పడుతున్నారు.
దీంతో అక్కడ కూడా కాపు ప్రయత్నాలు సాగేలా కనిపించడం లేదు. మరోవైపు.. బీజేపీ నుంచి ఆఫర్లు ఎదురు వస్తుండడం ఒక్కటే కాపు ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. కానీ, ఆ పార్టీలోకి వెళ్తే.. ఇప్పటి వరకు ఆయనకు జై కొట్టిన మైనారిటీ వర్గం దూరమయ్యేసూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కాపు వారి ప్రయత్నాలు .. ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్నాయి. మరి ఏంచేస్తారోచూడాలి.
This post was last modified on January 10, 2024 6:31 pm
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…