Political News

1+1 ఆఫ‌ర్‌.. ఇదీ కేశినేనికి వైసీపీ హామీ!

తాజాగా వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మైన విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేనికి సీఎం జ‌గ‌న్ 1+1 ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సుదీర్ఘ ర‌హ‌స్య మంత‌నాలు.. చ‌ర్చ‌లు.. అనేక డిమాండ్ల త‌ర్వాత‌.. కేశినేని గుట్టు విప్పారు. నేరుగా తాడేప‌ల్లికి వెళ్లి.. సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌నపై పొగ‌డ్త‌ల‌కు కురిపించ‌లేదు కానీ.. ఫ‌క్తు.. రాజ‌కీయ నాయ‌కుడు అనిపించేశారు. టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యే అవ‌కాశం క‌ల్పించిన టీడీపీపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా.. విమ‌ర్శ‌లు చేయ‌ని నాయ‌కుడు.. అంటూ.. ఇప్పుడులేని నేప‌థ్యంలో కేశినేనిని కూడా అంద‌రిలాగానే భావించాల్సి ఉంది.

ఇక‌, వైసీపీ నుంచి కేశినేని ప్ర‌ధానంగా ఆశించిన‌వి.. టీడీపీలో ద‌క్క‌నివి ప‌రిశీలిస్తే.. రెండే రెండు.. ఒక‌టి త‌న‌కు ఎంపీ సీటు. విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి మూడోసారి కూడా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుని.. హ్యాట్రిక్ కొట్టాల‌ని.. త‌ద్వారా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో రికార్డు సృష్టించాల‌ని కేశినేని వ్యూహం. గ‌తంలో 2004, 2009లో ఒక్క‌సారి మాత్రమే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకుని విజ‌య‌వాడ ఎంపీ అయ్యారు. దీనికి ముందు చాలా మంది ఎంపీలు గెలిచినా..వ‌రుస‌గా మూడుసార్లు ఎవ‌రూ విజ‌యం ద‌క్కించుకోలేదు.

ఈ రికార్డును తాను సాధించాల‌నేది కేశినేని వ్యూహం. అయితే.. అస‌లు టీడీపీ ఈ ద‌ఫా టికెట్ నిరాక‌రించింద‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. దీనికి తోడు.. ఎప్ప‌టి నుంచో కేశినేని త‌న కుమార్తె శ్వేత‌కు విజ‌య‌వాడ తూర్పు లేదా.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆశిస్తు న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నాక‌.. అనూహ్యంగా స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. దీంతో తూర్పుపై క‌న్నేసిన ఆయ‌న ఇక్క‌డైనా టికెట్ ఇవ్వాల‌ని కోరారు. ఈ రెండు సాధ్యం కాలేదు. ఈ ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న తూర్పు నుంచి కుమార్తెను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు.

అయితే.. టీడీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా శ్వేత‌కు అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 1+1 ఆఫ‌ర్ కోసం వేచి చూసిన కేశినేని.. ఇది ఎలానూ ద‌క్క‌ద‌ని భావించి.. పార్టీతో విభేదించారు. ఇదేస‌మ‌యంలో తూర్పులో పాగావేయాల‌న్న‌.. వైసీపీకి కేశినేని వ్యూహానికి మ‌ధ్య పొంత‌న ఉండ‌డంతో అనూహ్యంగా ఇప్పుడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారాయి. దీంతో ఇటు వైసీపీ కూడా ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం.. ఆయ‌న సై అన‌డం రెండూ ఒకే సారి జ‌రిగాయి. మొత్తానికి విజ‌య‌వాడ ఎంపీ టికెట్‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స్థానం రెండూ కూడా కేశినేని ఖాతాలో ప‌డేందుకు మార్గం సుగ‌మం అయింద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

2 minutes ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

17 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago