Political News

1+1 ఆఫ‌ర్‌.. ఇదీ కేశినేనికి వైసీపీ హామీ!

తాజాగా వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మైన విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేనికి సీఎం జ‌గ‌న్ 1+1 ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సుదీర్ఘ ర‌హ‌స్య మంత‌నాలు.. చ‌ర్చ‌లు.. అనేక డిమాండ్ల త‌ర్వాత‌.. కేశినేని గుట్టు విప్పారు. నేరుగా తాడేప‌ల్లికి వెళ్లి.. సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌నపై పొగ‌డ్త‌ల‌కు కురిపించ‌లేదు కానీ.. ఫ‌క్తు.. రాజ‌కీయ నాయ‌కుడు అనిపించేశారు. టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యే అవ‌కాశం క‌ల్పించిన టీడీపీపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా.. విమ‌ర్శ‌లు చేయ‌ని నాయ‌కుడు.. అంటూ.. ఇప్పుడులేని నేప‌థ్యంలో కేశినేనిని కూడా అంద‌రిలాగానే భావించాల్సి ఉంది.

ఇక‌, వైసీపీ నుంచి కేశినేని ప్ర‌ధానంగా ఆశించిన‌వి.. టీడీపీలో ద‌క్క‌నివి ప‌రిశీలిస్తే.. రెండే రెండు.. ఒక‌టి త‌న‌కు ఎంపీ సీటు. విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి మూడోసారి కూడా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుని.. హ్యాట్రిక్ కొట్టాల‌ని.. త‌ద్వారా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో రికార్డు సృష్టించాల‌ని కేశినేని వ్యూహం. గ‌తంలో 2004, 2009లో ఒక్క‌సారి మాత్రమే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకుని విజ‌య‌వాడ ఎంపీ అయ్యారు. దీనికి ముందు చాలా మంది ఎంపీలు గెలిచినా..వ‌రుస‌గా మూడుసార్లు ఎవ‌రూ విజ‌యం ద‌క్కించుకోలేదు.

ఈ రికార్డును తాను సాధించాల‌నేది కేశినేని వ్యూహం. అయితే.. అస‌లు టీడీపీ ఈ ద‌ఫా టికెట్ నిరాక‌రించింద‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. దీనికి తోడు.. ఎప్ప‌టి నుంచో కేశినేని త‌న కుమార్తె శ్వేత‌కు విజ‌య‌వాడ తూర్పు లేదా.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆశిస్తు న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నాక‌.. అనూహ్యంగా స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. దీంతో తూర్పుపై క‌న్నేసిన ఆయ‌న ఇక్క‌డైనా టికెట్ ఇవ్వాల‌ని కోరారు. ఈ రెండు సాధ్యం కాలేదు. ఈ ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న తూర్పు నుంచి కుమార్తెను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు.

అయితే.. టీడీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా శ్వేత‌కు అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 1+1 ఆఫ‌ర్ కోసం వేచి చూసిన కేశినేని.. ఇది ఎలానూ ద‌క్క‌ద‌ని భావించి.. పార్టీతో విభేదించారు. ఇదేస‌మ‌యంలో తూర్పులో పాగావేయాల‌న్న‌.. వైసీపీకి కేశినేని వ్యూహానికి మ‌ధ్య పొంత‌న ఉండ‌డంతో అనూహ్యంగా ఇప్పుడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారాయి. దీంతో ఇటు వైసీపీ కూడా ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం.. ఆయ‌న సై అన‌డం రెండూ ఒకే సారి జ‌రిగాయి. మొత్తానికి విజ‌య‌వాడ ఎంపీ టికెట్‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స్థానం రెండూ కూడా కేశినేని ఖాతాలో ప‌డేందుకు మార్గం సుగ‌మం అయింద‌ని అంటున్నారు.

This post was last modified on January 10, 2024 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago