తాజాగా వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధమైన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనికి సీఎం జగన్ 1+1 ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ రహస్య మంతనాలు.. చర్చలు.. అనేక డిమాండ్ల తర్వాత.. కేశినేని గుట్టు విప్పారు. నేరుగా తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్ను కలుసుకున్నారు. ఆయనపై పొగడ్తలకు కురిపించలేదు కానీ.. ఫక్తు.. రాజకీయ నాయకుడు అనిపించేశారు. టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యే అవకాశం కల్పించిన టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయినా.. విమర్శలు చేయని నాయకుడు.. అంటూ.. ఇప్పుడులేని నేపథ్యంలో కేశినేనిని కూడా అందరిలాగానే భావించాల్సి ఉంది.
ఇక, వైసీపీ నుంచి కేశినేని ప్రధానంగా ఆశించినవి.. టీడీపీలో దక్కనివి పరిశీలిస్తే.. రెండే రెండు.. ఒకటి తనకు ఎంపీ సీటు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి మూడోసారి కూడా పోటీ చేసి విజయం దక్కించుకుని.. హ్యాట్రిక్ కొట్టాలని.. తద్వారా విజయవాడ రాజకీయాల్లో రికార్డు సృష్టించాలని కేశినేని వ్యూహం. గతంలో 2004, 2009లో ఒక్కసారి మాత్రమే లగడపాటి రాజగోపాల్ రెండు సార్లు విజయం దక్కించుకుని విజయవాడ ఎంపీ అయ్యారు. దీనికి ముందు చాలా మంది ఎంపీలు గెలిచినా..వరుసగా మూడుసార్లు ఎవరూ విజయం దక్కించుకోలేదు.
ఈ రికార్డును తాను సాధించాలనేది కేశినేని వ్యూహం. అయితే.. అసలు టీడీపీ ఈ దఫా టికెట్ నిరాకరించిందనేది ప్రధాన చర్చ. దీనికి తోడు.. ఎప్పటి నుంచో కేశినేని తన కుమార్తె శ్వేతకు విజయవాడ తూర్పు లేదా.. పశ్చిమ నియోజకవర్గాలను ఆశిస్తు న్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ అనుకున్నాక.. అనూహ్యంగా సమీకరణలు మారిపోయాయి. దీంతో తూర్పుపై కన్నేసిన ఆయన ఇక్కడైనా టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ రెండు సాధ్యం కాలేదు. ఈ ఎన్నికల్లో అయినా.. ఆయన తూర్పు నుంచి కుమార్తెను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.
అయితే.. టీడీపీకి ఇక్కడ బలమైన నాయకుడు గద్దె రామ్మోహన్ ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా శ్వేతకు అవకాశం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో 1+1 ఆఫర్ కోసం వేచి చూసిన కేశినేని.. ఇది ఎలానూ దక్కదని భావించి.. పార్టీతో విభేదించారు. ఇదేసమయంలో తూర్పులో పాగావేయాలన్న.. వైసీపీకి కేశినేని వ్యూహానికి మధ్య పొంతన ఉండడంతో అనూహ్యంగా ఇప్పుడు రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. దీంతో ఇటు వైసీపీ కూడా ఆయనను ఆహ్వానించడం.. ఆయన సై అనడం రెండూ ఒకే సారి జరిగాయి. మొత్తానికి విజయవాడ ఎంపీ టికెట్, విజయవాడ తూర్పు నియోజకవర్గం స్థానం రెండూ కూడా కేశినేని ఖాతాలో పడేందుకు మార్గం సుగమం అయిందని అంటున్నారు.
This post was last modified on January 10, 2024 6:05 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…