Political News

అమ్మ రాయుడూ.. పాలిటిక్స్ బాగానే ఒంట‌బ‌ట్టాయే!

అంబ‌టి రాయుడు. ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల్లో భారీ ఎత్తున వినిపించిన పేరు. భార‌త మాజీ క్రికెట‌ర్‌గా మంచి పేరు, అభిమానుల‌ను సంపాయించుకున్న రాయుడు స్వ‌స్థ‌లం ఉమ్మ‌డి గుంటూరు జిల్లా. కొన్నాళ్ల కిందటే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు ఇటీవ‌ల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందే ఆయ‌న గుంటూరులోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. అయితే.. ఏమైందో ఏమో.. అనూహ్యంగా పార్టీలో చేరిన ఆరు రోజుల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న బ‌య‌ట‌కువ‌చ్చేశారు.

వైసీపీ కండువా మాయ‌ను కూడా మాయ‌కముందే.. రాయుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌డం ఇటీవ‌ల సంచ‌లనంగా మారింది. దీనిపై అనేక విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. వైసీపీని కార్న‌ర్ చేస్తూ.. టీడీపీ స‌హా ఇత‌ర పార్టీలు ఏకేశాయి. అంబ‌టి ముందుగానే వైసీపీ నైజం తెలుసుకున్నార‌ని.. ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన అంబ‌టి.. తానుదుబాయ్ లో జ‌ర‌గ‌నున్న ఓ టోర్నీలో పాల్గొంటున్నాన‌ని.. దీనికి , రాజ‌కీయాల‌కు సంబంధం ఉండ‌కూడ‌ద‌ని.. అందుకే.. బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చారు.

క‌ట్ చేస్తే.. అందరూ దీనిని నిజ‌మ‌నే అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా మంగ‌ళ‌వారం రాత్రి ఎవరి కంటా పడకుండా.. రాయుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో భేటీ అయ్యార‌నే విష‌యం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. గుంటూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రితోనూన ఆయ‌న ట‌చ్‌లోకి వెళ్లార‌ని చెబుతున్నారు. దీంతో రాయుడు రాజ‌కీయం.. జ‌న‌సేన కేంద్రంగా సాగే అవ‌కాశం ఉంద‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న ఈ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌ని చ‌ర్చ సాగుతోంది. ఏదేమైనా.. అమ్మ రాయుడూ.. పాలిటిక్స్ బాగానే ఒంట‌బ‌ట్టాయే! అంటున్నారు అభిమానులు.

This post was last modified on January 10, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: Rayudu

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago