అంబటి రాయుడు. ఇటీవల కాలంలో రాజకీయాల్లో భారీ ఎత్తున వినిపించిన పేరు. భారత మాజీ క్రికెటర్గా మంచి పేరు, అభిమానులను సంపాయించుకున్న రాయుడు స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా. కొన్నాళ్ల కిందటే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందే ఆయన గుంటూరులోని పలు గ్రామాల్లో పర్యటించారు. అయితే.. ఏమైందో ఏమో.. అనూహ్యంగా పార్టీలో చేరిన ఆరు రోజుల వ్యవధిలోనే ఆయన బయటకువచ్చేశారు.
వైసీపీ కండువా మాయను కూడా మాయకముందే.. రాయుడు ఆ పార్టీకి గుడ్బై చెప్పడం ఇటీవల సంచలనంగా మారింది. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. వైసీపీని కార్నర్ చేస్తూ.. టీడీపీ సహా ఇతర పార్టీలు ఏకేశాయి. అంబటి ముందుగానే వైసీపీ నైజం తెలుసుకున్నారని.. పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే.. దీనిపై వివరణ ఇచ్చిన అంబటి.. తానుదుబాయ్ లో జరగనున్న ఓ టోర్నీలో పాల్గొంటున్నానని.. దీనికి , రాజకీయాలకు సంబంధం ఉండకూడదని.. అందుకే.. బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. అందరూ దీనిని నిజమనే అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మరో సంచలన వార్త తెరమీదికి వచ్చింది. తాజాగా మంగళవారం రాత్రి ఎవరి కంటా పడకుండా.. రాయుడు జనసేన అధినేత పవన్తో భేటీ అయ్యారనే విషయం సంచలనంగా మారింది. అంతేకాదు.. గుంటూరుకు చెందిన కీలక నాయకుడు ఒకరితోనూన ఆయన టచ్లోకి వెళ్లారని చెబుతున్నారు. దీంతో రాయుడు రాజకీయం.. జనసేన కేంద్రంగా సాగే అవకాశం ఉందని.. త్వరలోనే ఆయన ఈ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ సాగుతోంది. ఏదేమైనా.. అమ్మ రాయుడూ.. పాలిటిక్స్ బాగానే ఒంటబట్టాయే! అంటున్నారు అభిమానులు.
This post was last modified on January 10, 2024 2:57 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…