Political News

కాంగ్రెస్ లోకి ‘కాపు’ ఖాయమా ?

కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు.

జగన్ నిర్ణయంతో కాపు మండిపోతున్నారు. అందుకనే తాను ఏదోపార్టీలో చేరటమా ? లేకపోతే తన భార్యతో కలిసి ఇండిపెండెంట్లుగా పోటీచేయటమా ? అన్నది తొందరలోనే చెబుతానని మూడురోజుల క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే తాజాగా తన భార్యతో కలిసి రఘువీరాతో భేటీ అవటంతో కాపు కుటుంబం కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని పట్టుదలగా ఉన్న కాపుకు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరితే టికెట్ దక్కే అవకాశంలేదు.

కాంగ్రెస్ లో చేరితే టికెట్ దక్కటం ఖాయం. అయితే తాను మాత్రమే పోటీచేస్తారా ? లేకపోతే తన భార్యకు కూడా కాపు టికెట్ అడుగుతున్నారా అన్నదే తెలీటంలేదు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాపు నాలుగోసారి ఏ పార్టీ తరపున పోటీచేస్తారన్నది ఆసక్తిగా  మారింది. కాంగ్రెస్ తరపున 2009లో పోటీచేసి గెలిచారు. తర్వాత పార్టీలో నుండి బయటకు వచ్చేసి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓడిపోయినా 2019లో మళ్ళీ అదే కాలువపై గెలిచారు.

రాబోయే ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి గెలుద్దామని అనుకుంటున్న కాపుకు జగన్ పెద్ద సాకే ఇచ్చారు. దాంతో నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. అయితే గెలుపే అనుమానంగా తయారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి అందరికీ తెలిసిందే కాబట్టి వైసీపీ నుండి వచ్చే వాళ్ళకి టికెట్లిచ్చినా గెలుపు గ్యారెంటి అని  అనుకునేందుకు లేదు.

This post was last modified on January 10, 2024 10:12 am

Share

Recent Posts

వైసీపీ ఎత్తుగ‌డ‌: బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా…?

కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ క‌య్యానికి సుముఖంగా లేమ‌ని వైసీపీ స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…

27 minutes ago

సీనియర్లను ట్రోల్ చేస్తే ఎవరికి ప్రయోజనం

ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…

2 hours ago

అసలైన అనిరుధ్ బయటికి వచ్చాడు

గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…

3 hours ago

ఇప్పటికీ సచినే నెంబర్ వన్

సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…

6 hours ago

నోరు అదుపులో పెట్టుకోక‌పోతే… కోడిగుడ్లే ప‌డ‌తాయి: సుప్రీంకోర్టు

``దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చేందుకు మ‌న వాళ్లు తుపాకీ తూటాల‌కే వెనుకాడ‌లేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్ల‌కు భ‌య‌ప‌డ‌తారా?``అంటూ.. తృణ‌మూల్…

6 hours ago

`టార్గెట్ లోకేష్‌`… సింప‌తీ రాదు జ‌గ‌న్‌… !

ప్ర‌స్తుతం వైసీపీ పెట్టుకున్న ల‌క్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించ‌డం. గ‌త వారం రోజులుగా ఈ విష‌యాన్ని…

9 hours ago