కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు.
జగన్ నిర్ణయంతో కాపు మండిపోతున్నారు. అందుకనే తాను ఏదోపార్టీలో చేరటమా ? లేకపోతే తన భార్యతో కలిసి ఇండిపెండెంట్లుగా పోటీచేయటమా ? అన్నది తొందరలోనే చెబుతానని మూడురోజుల క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే తాజాగా తన భార్యతో కలిసి రఘువీరాతో భేటీ అవటంతో కాపు కుటుంబం కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని పట్టుదలగా ఉన్న కాపుకు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరితే టికెట్ దక్కే అవకాశంలేదు.
కాంగ్రెస్ లో చేరితే టికెట్ దక్కటం ఖాయం. అయితే తాను మాత్రమే పోటీచేస్తారా ? లేకపోతే తన భార్యకు కూడా కాపు టికెట్ అడుగుతున్నారా అన్నదే తెలీటంలేదు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాపు నాలుగోసారి ఏ పార్టీ తరపున పోటీచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ తరపున 2009లో పోటీచేసి గెలిచారు. తర్వాత పార్టీలో నుండి బయటకు వచ్చేసి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓడిపోయినా 2019లో మళ్ళీ అదే కాలువపై గెలిచారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి గెలుద్దామని అనుకుంటున్న కాపుకు జగన్ పెద్ద సాకే ఇచ్చారు. దాంతో నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. అయితే గెలుపే అనుమానంగా తయారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి అందరికీ తెలిసిందే కాబట్టి వైసీపీ నుండి వచ్చే వాళ్ళకి టికెట్లిచ్చినా గెలుపు గ్యారెంటి అని అనుకునేందుకు లేదు.
This post was last modified on January 10, 2024 10:12 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…