కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు.
జగన్ నిర్ణయంతో కాపు మండిపోతున్నారు. అందుకనే తాను ఏదోపార్టీలో చేరటమా ? లేకపోతే తన భార్యతో కలిసి ఇండిపెండెంట్లుగా పోటీచేయటమా ? అన్నది తొందరలోనే చెబుతానని మూడురోజుల క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే తాజాగా తన భార్యతో కలిసి రఘువీరాతో భేటీ అవటంతో కాపు కుటుంబం కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని పట్టుదలగా ఉన్న కాపుకు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరితే టికెట్ దక్కే అవకాశంలేదు.
కాంగ్రెస్ లో చేరితే టికెట్ దక్కటం ఖాయం. అయితే తాను మాత్రమే పోటీచేస్తారా ? లేకపోతే తన భార్యకు కూడా కాపు టికెట్ అడుగుతున్నారా అన్నదే తెలీటంలేదు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాపు నాలుగోసారి ఏ పార్టీ తరపున పోటీచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ తరపున 2009లో పోటీచేసి గెలిచారు. తర్వాత పార్టీలో నుండి బయటకు వచ్చేసి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓడిపోయినా 2019లో మళ్ళీ అదే కాలువపై గెలిచారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి గెలుద్దామని అనుకుంటున్న కాపుకు జగన్ పెద్ద సాకే ఇచ్చారు. దాంతో నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. అయితే గెలుపే అనుమానంగా తయారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి అందరికీ తెలిసిందే కాబట్టి వైసీపీ నుండి వచ్చే వాళ్ళకి టికెట్లిచ్చినా గెలుపు గ్యారెంటి అని అనుకునేందుకు లేదు.
This post was last modified on January 10, 2024 10:12 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…