కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు.
జగన్ నిర్ణయంతో కాపు మండిపోతున్నారు. అందుకనే తాను ఏదోపార్టీలో చేరటమా ? లేకపోతే తన భార్యతో కలిసి ఇండిపెండెంట్లుగా పోటీచేయటమా ? అన్నది తొందరలోనే చెబుతానని మూడురోజుల క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే తాజాగా తన భార్యతో కలిసి రఘువీరాతో భేటీ అవటంతో కాపు కుటుంబం కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని పట్టుదలగా ఉన్న కాపుకు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరితే టికెట్ దక్కే అవకాశంలేదు.
కాంగ్రెస్ లో చేరితే టికెట్ దక్కటం ఖాయం. అయితే తాను మాత్రమే పోటీచేస్తారా ? లేకపోతే తన భార్యకు కూడా కాపు టికెట్ అడుగుతున్నారా అన్నదే తెలీటంలేదు. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాపు నాలుగోసారి ఏ పార్టీ తరపున పోటీచేస్తారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ తరపున 2009లో పోటీచేసి గెలిచారు. తర్వాత పార్టీలో నుండి బయటకు వచ్చేసి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్ధి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓడిపోయినా 2019లో మళ్ళీ అదే కాలువపై గెలిచారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి గెలుద్దామని అనుకుంటున్న కాపుకు జగన్ పెద్ద సాకే ఇచ్చారు. దాంతో నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. అయితే గెలుపే అనుమానంగా తయారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి అందరికీ తెలిసిందే కాబట్టి వైసీపీ నుండి వచ్చే వాళ్ళకి టికెట్లిచ్చినా గెలుపు గ్యారెంటి అని అనుకునేందుకు లేదు.
This post was last modified on January 10, 2024 10:12 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…