Political News

రాతియుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం వస్తారా?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన చంద్రబాబు బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నంద్యాలలో సభ దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం చంద్రబాబుకు నీరాజనం పలికారు.

ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ఓటేసిన అనర్హుడిని అందలం ఎక్కించామని బాధపడుతున్నారని చురకలంటించారు. జగన్ కు రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులు మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. రాతియుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం తనతో వస్తారా అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, ధ్వంసం అయిందని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని రాబోయే ఎన్నికలతో అందరి కష్టాలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నంద్యాల ప్రజల జోరు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని అనిపిస్తోందని, ఈ జన సునామీ చూసి తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోందని చెప్పారుజ ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును జగన్ అటకెక్కించారని చురకలంటించారు. జగన్ రాయలసీమ ద్రోహి అని, కర్నూలుకు హైకోర్టు తెస్తానని మోసం చేస్తున్నారని అన్నారు. ఇక, కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తమదని చంద్రబాబు చెప్పారు.

రాయలసీమకు 350 టీఎంసీల నీటిని అందించడమే తన లక్ష్యమన్నారు. మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను జగన్ మోసం చేశాడని, ఎన్నో కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయని విమర్శించారు. టీడీపీ, జనసేన జెండాను యువత పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, జగనన్న వదిలిన బాణం ఎక్కడ ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వివేకాను హత్య చేసి ఎన్నో డ్రామాలు ఆడారని, ఆఖరికి వివేకా కూతురుపై, సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టారని అన్నారు. చెత్తపై కూడా పని చేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు.

This post was last modified on January 9, 2024 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

2 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

3 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

5 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

6 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

7 hours ago