‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మగతనం తప్ప.. పగతనం లేదు’ అని ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ ఎస్ పార్టీ నాయకులతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైనా.. పాలకులపైనా ఆయన నిశిత విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ పదేళ్లు పాలించినా.. ఎవరిపైనా పగ తీర్చుకునేలా వ్యవహరించలేదన్నారు.
కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు.. బీఆర్ ఎస్ నాయకులపై పగతీర్చుకునేలా పాలన చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు. ఇప్పటికే చాలా మందిపై జిల్లాల స్థాయిలో కేసులు నమోదయ్యాయన్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలపైనా తీవ్ర స్థాయిలో కేసులు పెట్టేందుకు తెరచాటున పక్కా స్కెచ్ వేస్తున్నారని తెలిపారు. అయితే.. ఇలాంటి చర్యలకు బీఆర్ఎస్ నాయకులు భయపడబోరని హరీష్ రావు చెప్పారు. గతంలో పదేళ్లు పాలించిన కేసీఆర్..ఇలా కక్షసాధింపు చర్యలకు దిగి ఉంటే.. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ.. జైల్లోనే ఉండేవారని వ్యాఖ్యానించారు.
ఇక, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్లో మూడు గ్రూపులు ఉన్నాయని హరీష్రావు అన్నారు. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, మరొకటి టీడీపీ కాంగ్రెస్, ఇంకొకటి అసలు కాంగ్రెస్ అని అన్నారు. ఎవరు ఎలా ఉన్నా.. బీఆర్ ఎస్ గెలుపు కోసం అందరూ కలసి కట్టుగా పోటీ చేయాలని హరీష్రావు పిలుపునిచ్చారు. ఖమ్మం టికెట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
పథకాలపై..
కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునేందుకు అలివి మీరిన హామీలను ఇచ్చిందన్న హరీష్రావు.. వాటిని అమలు చేసేందుకు తాత్సారం చేస్తోందని విమర్శించారు. అందుకే ప్రతి పథకం అమలుకు 100 రోజుల డెడ్ లైన్ అంటూ .. ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ, అప్పటికి కూడా కాంగ్రెస్ ఆయా పథకాలను అమలు చేయడం సాధ్యంకాదన్నారు. ప్రజలే ఈ విషయంపై కేసులు పెట్టే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…