రేవంత్ కంటే కేసీఆర్ బలవంతుడన్న కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ఫుల్ అని షాకింగ్ కామెంట్లు చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు కేసీఆర్ వస్తున్నారని ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లోకసభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో అందరం కలిసి పోరాడుదామని, లోక్ సభ స్థానం కచ్చితంగా గెలవాల్సిందేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బలం..గళం బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుపొందామని, 11 స్థానాల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యామని కేటీఆర్ చెప్పారు. అయితే, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ ముందుకు పోదామని పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్….నెల రోజులు దాటినా అమలు చేయకపోవడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని చెప్పారు. ఇక, ప్రజా పాలన దరఖాస్తుల పట్ల కొందరు ప్రైవేటు వ్యక్తులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని. ఆ దరఖాస్తుల్లో కోట్లాదిమంది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సున్నితమైన డేటా ఉందని కేటీఆర్ అన్నారు. ఆ డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 6 గ్యారెంటీలలో ఏదైనా మీకు ఇస్తామంటూ ఫోన్ వస్తే ఓటీపీ, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని చెప్పారు.

కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి…శాసనమండలిని ఇరానీ కేఫ్ అని, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని అన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణి దేవి, ప్రభాకర్ కలిసి రేవంత్ పై ఫిర్యాదు చేశారు. శాసనమండలిని ఇరానీ కేఫ్ ,మండలి సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago