ఏపీ సీఎం జగన్ను శపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు.. ప్రముఖ సువార్తీకులు కిలారి ఆనందపాల్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి రోడ్ల మీదే హల్చల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుని.. మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న కాంక్షతో .. ఆశయంతో .. తాను తాడేపల్లికి వచ్చినట్టు చెప్పారు. అయితే.. తాడేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు.. పాల్ను లోపలికి అనుమతించలేదు.
దీంతో రెండు మూడు గంటల పాటు.. సమీపంలోని టీకొట్లు, చెట్ల కిందే పచారీ చేసిన పాల్.. వచ్చిన ప్రతిమీడియా ప్రతినిధితోనూ చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 175 సీట్లలో విజయం దక్కించుకుంటుందని అన్నారు. తనతో జగన్ పార్టీ పొత్తు పెట్టుకుంటే వారికే మంచిదన్నారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ జగన్ కోల్పోకుండా ఉండాలంటే.. మాతో పొత్తు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు. ఇలా.. ఆయన చాలా సేపు తాడేపల్లి రోడ్లపై హల్చల్ చేశారు.
అయితే.. ఎంతకీ సీఎంవో నుంచి ఎలాంటి సందేశం రాలేదు. దీంతో కొంత అసహనానికి గురైన పాల్.. తనకు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు జగన్ భయపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీనే ఆయనను ఓడిస్తుందని ఆయనకు కూడా తెలిసిపోయిందని.. అందుకే అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అయితే.. అప్పాయింట్మెంట్ ఇచ్చే వరకు తాను ఇక్కడే ఉంటానన్న ఆయన.. అప్పాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో సీఎం జగన్ను శపిస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత.. సీఎం జగన్.. మాజీ సీఎం జగన్ అయిపోతాడని అన్నారు. మొత్తానికి ఈ కామెంట్లు నవ్వులు పూయిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 9, 2024 10:04 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…