Political News

ఏపీలో దళితులు నామినేషన్ వేసే పరిస్థితి లేదు: పవన్

విజయవాడలో పర్యటటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా సీఈసీ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, హింస పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అధికారులకు వివరించామన్నారు. గత 2 నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయని, నచ్చిన పోలీసులను ఎన్నికల సమయానికి విధుల్లో ఉండేలాగా వైసీపీ నేతలు చూసుకుంటున్నారని ఫిర్యాదు చేశామన్నారు.

ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేతలపై బైండోవర్ కేసులు పెడుతూ ఇక్కట్ల పాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీతో పాటు జనసేన తరఫున అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించామని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేస్తే అందులో ఒక వంతు ఆమోదించారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో, పారదర్శక ఎన్నికల కోసం ఆయన ఎలా కృషి చేశారో ఎన్నికల సంఘం అధికారులకు వివరించామన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని సీఈసీ అధికారులకు విన్నవించినట్టుగా చెప్పారు. తాము చెప్పిన విషయాలను అధికారులు సావధానంగా విన్నారని, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని భరోసానిచ్చారని పవన్ చెప్పారు. ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని, నికార్సయిన పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మారుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on January 9, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది…

2 hours ago

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…

4 hours ago

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…

10 hours ago

215 కోట్ల ఆఫర్ వద్దనుకున్నారా

దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…

11 hours ago

‘భ‌ర్త సంపాద‌న ఎంతో భార్య‌కు చెప్ప‌క్క‌ర్లేదు’

స‌హ‌జంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్య‌లు ఆస‌క్తి చూపుతారు. ఈ విష‌యం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…

11 hours ago

డేర్ చేయకపోవడమే డెకాయిట్ తెలివి

ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…

13 hours ago