విజయవాడలో పర్యటటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా సీఈసీ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, హింస పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అధికారులకు వివరించామన్నారు. గత 2 నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయని, నచ్చిన పోలీసులను ఎన్నికల సమయానికి విధుల్లో ఉండేలాగా వైసీపీ నేతలు చూసుకుంటున్నారని ఫిర్యాదు చేశామన్నారు.
ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేతలపై బైండోవర్ కేసులు పెడుతూ ఇక్కట్ల పాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీతో పాటు జనసేన తరఫున అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించామని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేస్తే అందులో ఒక వంతు ఆమోదించారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో, పారదర్శక ఎన్నికల కోసం ఆయన ఎలా కృషి చేశారో ఎన్నికల సంఘం అధికారులకు వివరించామన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని సీఈసీ అధికారులకు విన్నవించినట్టుగా చెప్పారు. తాము చెప్పిన విషయాలను అధికారులు సావధానంగా విన్నారని, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని భరోసానిచ్చారని పవన్ చెప్పారు. ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని, నికార్సయిన పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మారుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 9, 2024 2:57 pm
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…