Political News

ఏపీలో దళితులు నామినేషన్ వేసే పరిస్థితి లేదు: పవన్

విజయవాడలో పర్యటటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా సీఈసీ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, హింస పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అధికారులకు వివరించామన్నారు. గత 2 నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయని, నచ్చిన పోలీసులను ఎన్నికల సమయానికి విధుల్లో ఉండేలాగా వైసీపీ నేతలు చూసుకుంటున్నారని ఫిర్యాదు చేశామన్నారు.

ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేతలపై బైండోవర్ కేసులు పెడుతూ ఇక్కట్ల పాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీతో పాటు జనసేన తరఫున అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించామని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేస్తే అందులో ఒక వంతు ఆమోదించారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో, పారదర్శక ఎన్నికల కోసం ఆయన ఎలా కృషి చేశారో ఎన్నికల సంఘం అధికారులకు వివరించామన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని సీఈసీ అధికారులకు విన్నవించినట్టుగా చెప్పారు. తాము చెప్పిన విషయాలను అధికారులు సావధానంగా విన్నారని, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని భరోసానిచ్చారని పవన్ చెప్పారు. ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని, నికార్సయిన పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మారుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on January 9, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

8 minutes ago

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

1 hour ago

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…

1 hour ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

1 hour ago

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…

1 hour ago

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

3 hours ago