వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్నారైలకు పెద్దపీట వేయనుందా? మెజారిటీ స్థానాల్లో ఎన్నారై టీడీపీ నాయకు లకు సీట్లు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారా? అంటే.. ఔననే చర్చే తెరమీదికి వచ్చింది. ఇప్పటికే కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్ను ఎన్నారై నాయకుడు వెనిగళ్ల రాముకు చంద్రబా బు కేటాయించారు. దీంతో రాము ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోను తీసుకుని ప్రజనలు కూడా కలుస్తున్నారు.
ఇక, ఒక్క గుడివాడే కాకుండా.. పలు నియోజకవర్గాల్లో కూడా ఎన్నారైలకు చంద్రబాబు టికెట్లు ఖరారు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వీటిలో ప్రధానంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్కు టికెట్ ఇచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ కొంప కృష్ణకు టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక, ఇదే జిల్లా నెల్లిమర్లలోనూ మార్పులు తథ్యమని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పార్టీలో పెద్దగా దూకుడు చూపించని మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈయన స్థానంలో ఎన్నారై నేత బంగార్రాజుకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి కూడా ఈ దఫా ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్ర పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి 8 నుంచి 10 స్థానాల్లో ఎన్నారైలకు ఈ దఫా టికెట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేసమయంలో 4 నుంచి 6 పార్లమెంటుస్థానాలను కూడా ఎన్నారైలకు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
ఇవీ.. కారణాలు
ఉన్నపళంగా టీడీపీలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నారైలకు టికెట్లు ఇవ్వడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయని పార్టీలో చర్చసాగుతోంది. ప్రధానంగా వైసీపీ నేతల ఆర్థిక పోటీని తట్టుకుని నిలబడడం ఒకటైతే.. నియోజకవర్గంలో పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో స్థానిక నాయకులు విఫలం కావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎన్నారై పార్టీ నాయకులు గత ఐదేళ్లుగా యాక్టివ్గా ఉన్నారు. దీంతో వారిని సంతృప్తి పరచాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా ఉందని తెలుస్తోంది.
This post was last modified on January 8, 2024 12:27 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…