Political News

హైద‌రాబాద్ వెలిగిపోతుంటే.. అమ‌రావ‌తి వెల‌వెల బోతోంది

ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న దారుణంగా ఉంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అమ‌రావ‌తి మాత్రం వెల‌వెల బోతోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేసిన వ్య‌క్తి జ‌గ‌నేన‌ని విమ‌ర్శించారు. తాజాగా టీడీపీ చేప‌ట్టి ‘రా.. క‌ద‌లిరా!’ స‌భ ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు.. ఆవేశ భ‌రితంగా ప్ర‌సంగించారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిని పూర్తి చేస్తామ‌న్నారు. రాష్ట్రానికి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌పంచంలో తెలుగు జాతి నెంబ‌ర్‌1గా నిల‌బ‌డాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ రివ‌ర్స్ పాల‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాధితులేన‌ని చెప్పారు. “అస‌మ‌ర్థుడు ఉంటే.. రాష్ట్రం కొంత వ‌ర‌కు న‌ష్ట‌పోతుంది. కానీ, దుర్మార్గుడే పాల‌న చేస్తే.. రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అవుతుంది” అని చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్‌కు ప్ర‌చారం పిచ్చి మ‌రింత ముదిరిపోయింద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. పాసు బుక్కులు, చివ‌ర‌కు స‌రిహ‌ద్దు రాళ్ల‌పైనా జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ హ‌యాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల‌కు కూడా జ‌గ‌న్ త‌న బొమ్మ‌లే వేయించుకున్నార‌ని.. ఇంత ప్రచార పిచ్చి ఉన్న నాయ‌కుడిని ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. వ‌చ్చేది రైతు రాజ్య‌మేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ ఆట‌లు ఇక, సాగ‌నివ్వ‌న‌ని అన్నారు.

“ఎలాగైనా గెలవాల‌ని.. వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, వారి ఆట‌లు సాగ‌నివ్వ‌ను. రుషికొండ‌ను బోడిగుండు చేసి.. 500 కోట్ల‌తో విల్లా క‌ట్టుకున్నారు. ఐదు కోట్ల ప్ర‌జారాజ‌ధానిని ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని లేకుండా చేశాడు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో వంద స‌క్షేమ ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేశార‌ని అన్నారు. “సైతాన్ ప్ర‌భుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి” అని చంద్ర‌బాబు నినాదాలు చేశారు.

Satya

Recent Posts

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

21 minutes ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

1 hour ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

1 hour ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

2 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

2 hours ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

2 hours ago