Political News

హైద‌రాబాద్ వెలిగిపోతుంటే.. అమ‌రావ‌తి వెల‌వెల బోతోంది

ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న దారుణంగా ఉంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అమ‌రావ‌తి మాత్రం వెల‌వెల బోతోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేసిన వ్య‌క్తి జ‌గ‌నేన‌ని విమ‌ర్శించారు. తాజాగా టీడీపీ చేప‌ట్టి ‘రా.. క‌ద‌లిరా!’ స‌భ ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు.. ఆవేశ భ‌రితంగా ప్ర‌సంగించారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిని పూర్తి చేస్తామ‌న్నారు. రాష్ట్రానికి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌పంచంలో తెలుగు జాతి నెంబ‌ర్‌1గా నిల‌బ‌డాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ రివ‌ర్స్ పాల‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాధితులేన‌ని చెప్పారు. “అస‌మ‌ర్థుడు ఉంటే.. రాష్ట్రం కొంత వ‌ర‌కు న‌ష్ట‌పోతుంది. కానీ, దుర్మార్గుడే పాల‌న చేస్తే.. రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అవుతుంది” అని చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్‌కు ప్ర‌చారం పిచ్చి మ‌రింత ముదిరిపోయింద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. పాసు బుక్కులు, చివ‌ర‌కు స‌రిహ‌ద్దు రాళ్ల‌పైనా జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ హ‌యాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల‌కు కూడా జ‌గ‌న్ త‌న బొమ్మ‌లే వేయించుకున్నార‌ని.. ఇంత ప్రచార పిచ్చి ఉన్న నాయ‌కుడిని ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. వ‌చ్చేది రైతు రాజ్య‌మేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ ఆట‌లు ఇక, సాగ‌నివ్వ‌న‌ని అన్నారు.

“ఎలాగైనా గెలవాల‌ని.. వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, వారి ఆట‌లు సాగ‌నివ్వ‌ను. రుషికొండ‌ను బోడిగుండు చేసి.. 500 కోట్ల‌తో విల్లా క‌ట్టుకున్నారు. ఐదు కోట్ల ప్ర‌జారాజ‌ధానిని ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని లేకుండా చేశాడు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో వంద స‌క్షేమ ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేశార‌ని అన్నారు. “సైతాన్ ప్ర‌భుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి” అని చంద్ర‌బాబు నినాదాలు చేశారు.

This post was last modified on January 8, 2024 9:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

4 hours ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

4 hours ago