Political News

హైద‌రాబాద్ వెలిగిపోతుంటే.. అమ‌రావ‌తి వెల‌వెల బోతోంది

ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న దారుణంగా ఉంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అమ‌రావ‌తి మాత్రం వెల‌వెల బోతోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేసిన వ్య‌క్తి జ‌గ‌నేన‌ని విమ‌ర్శించారు. తాజాగా టీడీపీ చేప‌ట్టి ‘రా.. క‌ద‌లిరా!’ స‌భ ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు.. ఆవేశ భ‌రితంగా ప్ర‌సంగించారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిని పూర్తి చేస్తామ‌న్నారు. రాష్ట్రానికి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌పంచంలో తెలుగు జాతి నెంబ‌ర్‌1గా నిల‌బ‌డాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న్ రివ‌ర్స్ పాల‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాధితులేన‌ని చెప్పారు. “అస‌మ‌ర్థుడు ఉంటే.. రాష్ట్రం కొంత వ‌ర‌కు న‌ష్ట‌పోతుంది. కానీ, దుర్మార్గుడే పాల‌న చేస్తే.. రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం అవుతుంది” అని చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్‌కు ప్ర‌చారం పిచ్చి మ‌రింత ముదిరిపోయింద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. పాసు బుక్కులు, చివ‌ర‌కు స‌రిహ‌ద్దు రాళ్ల‌పైనా జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌ని విమ‌ర్శించారు. త‌మ హ‌యాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల‌కు కూడా జ‌గ‌న్ త‌న బొమ్మ‌లే వేయించుకున్నార‌ని.. ఇంత ప్రచార పిచ్చి ఉన్న నాయ‌కుడిని ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. వ‌చ్చేది రైతు రాజ్య‌మేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ ఆట‌లు ఇక, సాగ‌నివ్వ‌న‌ని అన్నారు.

“ఎలాగైనా గెలవాల‌ని.. వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, వారి ఆట‌లు సాగ‌నివ్వ‌ను. రుషికొండ‌ను బోడిగుండు చేసి.. 500 కోట్ల‌తో విల్లా క‌ట్టుకున్నారు. ఐదు కోట్ల ప్ర‌జారాజ‌ధానిని ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని లేకుండా చేశాడు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ త‌న పాల‌న‌లో వంద స‌క్షేమ ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేశార‌ని అన్నారు. “సైతాన్ ప్ర‌భుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి” అని చంద్ర‌బాబు నినాదాలు చేశారు.

This post was last modified on January 8, 2024 9:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

35 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

6 hours ago