Political News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కొట్టిన టీడీపీ కార్యకర్తలు

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. టీడీపీ కార్య‌క‌ర్త‌లకు మ‌ధ్య జ‌రిగిన తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో ఇరు ప‌క్షాలు చిత్తుచిత్తుగా కొట్టుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు ప‌క్షాల వారికీ స‌ర్దిచెప్పి పంపేశారు. టీడీపీ అదినేత చంద్ర‌బాబు నాయుడు.. ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్య‌టిస్తున్నారు. తాజాగా రూపొందించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొంటున్నారు. రోజుకు రెండు చొప్పున ఈ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆదివారం ఉద‌యం ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని తిరువూరులో రా.. క‌ద‌లిరా! స‌భ‌ను నిర్వ‌హించారు. అనంత‌రం.. అక్క‌డి నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో నిర్వ‌హించి ఇదే స‌బ‌కు చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. ఆయ‌న ప్ర‌సంగిస్తున్న స‌మ‌యం లో ఇదే స‌భ‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫొటోలతో కూడిన ప్లకార్డు ల‌ను ప్ర‌ద‌ర్శించారు. పార్టీలో జూనియ‌ర్‌కు స్థానం క‌ల్పించాలంటూ కొంద‌రు నినాదాలు చేశారు. ఆయ‌న‌ను దూరం పెట్టార‌ని వ్యాఖ్యానించారు.

ఒక‌వైపు చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలోనే ఈ వివాదం చోటు చేసుకోవ‌డంతో టీడీపీ త‌ర‌ఫున వ‌లంటీర్లుగా ఉండి.. స‌భ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌వారు.. చాలా సేపు జూనియ‌ర్ అభిమానుల‌కు స‌ర్ది చెప్పారు. అయితే.. వారు ఎంత‌కీ విన‌క‌పో వ‌డంతోపాటు.. మ‌రింతగా నినాదాలు పెంచారు. దీంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులను తోసివేశారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. కోపోద్రిక్తులైన టీడీపీ వ‌లంటీర్లు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌పై చేయిచేసుకున్నారు.ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు అభిమానుల‌కు గాయాల‌య్యారు.

స‌భ‌లో ఏం జ‌రుగుతోందో తెలుసుకునేలోగానే చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు ప‌క్షాల‌ను వారించారు. కొంద‌రిపై లాఠీలు కూడా ఝ‌ళిపించారు. దీంతో ఇరు ప‌క్షాలు స‌ర్దుకు న్నారు.అయితే.. ఈ ఘ‌ట‌న‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంద‌రు ఉద్దేశ పూర్వంగానే జూనియ‌ర్ ఎన్టీఆర్ బొమ్మ‌ల‌తో వివాదం సృష్టించి.. రా.. క‌ద‌లిరా! స‌భ‌లో క‌ల‌కలం సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. దీనికి త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వైసీపీనాయ‌కులు కొంద‌రు చెబుతున్నారు.

This post was last modified on January 8, 2024 7:02 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

3 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

6 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

7 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago