వైసీపీలో ఇలా చేరి అలా బయటకు వచ్చిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన నిష్క్రమణకు సంబంధించిన కారణాన్ని వెల్లడించారు. తిరిగి తాను క్రికెటర్గా అరంగేట్రం చేయనున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరగనున్న ఐఎల్టీ 20లో తాను ఆడనున్నట్టు చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండరాదనే నిబంధన ఉందని.. అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకొన్నానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. అంబటి రాయుడు వైసీపీలో చేరడం.. ఆ వెంటనే ఆరు రోజులకే ఆయన బయటకు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా వైసీపీ రెబల్ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నైజం నచ్చకే.. ఆయన బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. ఆరు రోజుల్లోనే పార్టీ పరిస్థితి ఆయనకు అర్థమైందని కొందరు విమర్శలు గుప్పించారు. అంబటికి.. వైసీపీకి పొసగదని, ఆయన సౌమ్యుడని.. కానీ, వైసీపీలో కఠినంగా ఉండే నాయకులకే చోటు ఉంటుందని.. అందుకే ఆయన తప్పుకొన్నారని కూడా విశ్లేషించారు.
ఇక, మరికొందరు.. అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారని చెప్పారు. అయితే.. దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించలేదని.. అందుకే బయటకు వచ్చేశారని విశ్లేషించారు. అంబటి రాయుడును మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఒత్తిడి చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతగా రాజకీయ విమర్శలు వచ్చినా.. వైసీపీ నాయకులు సంయమనం పాటించారు. ఎవరూ ఎక్కడా రాయుడి గురించి పన్నెత్తు మాట అనలేదు. ఇంతలోనే రాయుడు తన నిష్క్రమణకు సంబంధించిన కారణాలు వెల్లడించడంతో ఈ వివాదం టీ కప్పులో తుఫాను మాదిరిగా చల్లారిపోయింది.
This post was last modified on January 7, 2024 8:44 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…