వైసీపీలో ఇలా చేరి అలా బయటకు వచ్చిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన నిష్క్రమణకు సంబంధించిన కారణాన్ని వెల్లడించారు. తిరిగి తాను క్రికెటర్గా అరంగేట్రం చేయనున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరగనున్న ఐఎల్టీ 20లో తాను ఆడనున్నట్టు చెప్పారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండరాదనే నిబంధన ఉందని.. అందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకొన్నానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. అంబటి రాయుడు వైసీపీలో చేరడం.. ఆ వెంటనే ఆరు రోజులకే ఆయన బయటకు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా వైసీపీ రెబల్ నాయకులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నైజం నచ్చకే.. ఆయన బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. ఆరు రోజుల్లోనే పార్టీ పరిస్థితి ఆయనకు అర్థమైందని కొందరు విమర్శలు గుప్పించారు. అంబటికి.. వైసీపీకి పొసగదని, ఆయన సౌమ్యుడని.. కానీ, వైసీపీలో కఠినంగా ఉండే నాయకులకే చోటు ఉంటుందని.. అందుకే ఆయన తప్పుకొన్నారని కూడా విశ్లేషించారు.
ఇక, మరికొందరు.. అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారని చెప్పారు. అయితే.. దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరించలేదని.. అందుకే బయటకు వచ్చేశారని విశ్లేషించారు. అంబటి రాయుడును మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఒత్తిడి చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతగా రాజకీయ విమర్శలు వచ్చినా.. వైసీపీ నాయకులు సంయమనం పాటించారు. ఎవరూ ఎక్కడా రాయుడి గురించి పన్నెత్తు మాట అనలేదు. ఇంతలోనే రాయుడు తన నిష్క్రమణకు సంబంధించిన కారణాలు వెల్లడించడంతో ఈ వివాదం టీ కప్పులో తుఫాను మాదిరిగా చల్లారిపోయింది.
This post was last modified on January 7, 2024 8:44 pm
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…
నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…
నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…
జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…