వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేనల మధ్య మిత్రత్వం మరింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇక నుంచి ఏం చేయాలన్నా.. ఏవిషయంపై గళం విప్పాలన్నా.. ఏ అంశంపై పోరాటం చేయాలన్నా.. ఉమ్మడిగానే ముందుకు సాగాలని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని తాజాగా నిర్ణయించారు. దీనిపై తాజాగా హైదరాబాద్లో ఇరువురు నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు, పవన్లు సంయుక్తంగా భేటీ కావాలని నిర్ణయించారు.
ఈనెల 9వ తేదీన విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు సంయుక్తంగా ఈసీ బృందాన్ని కలిసి.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో టీడీపీ నిర్వహించాల్సిన ‘రా.. కదలిరా..’ కార్యక్రమం వాయిదా వేశారు. పవన్ కల్యాణ్తో కలిసి చంద్రబాబు ఈసీని కలవనున్న నేపథ్యంలో ఈ సభను వాయిదా వేశారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.
This post was last modified on January 7, 2024 12:19 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…