వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేనల మధ్య మిత్రత్వం మరింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇక నుంచి ఏం చేయాలన్నా.. ఏవిషయంపై గళం విప్పాలన్నా.. ఏ అంశంపై పోరాటం చేయాలన్నా.. ఉమ్మడిగానే ముందుకు సాగాలని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని తాజాగా నిర్ణయించారు. దీనిపై తాజాగా హైదరాబాద్లో ఇరువురు నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు, పవన్లు సంయుక్తంగా భేటీ కావాలని నిర్ణయించారు.
ఈనెల 9వ తేదీన విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు సంయుక్తంగా ఈసీ బృందాన్ని కలిసి.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో టీడీపీ నిర్వహించాల్సిన ‘రా.. కదలిరా..’ కార్యక్రమం వాయిదా వేశారు. పవన్ కల్యాణ్తో కలిసి చంద్రబాబు ఈసీని కలవనున్న నేపథ్యంలో ఈ సభను వాయిదా వేశారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.
This post was last modified on January 7, 2024 12:19 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…