Political News

ఏదైనా క‌లిసే.. బాబు, ప‌వ‌న్‌ల ఉమ్మ‌డి వ్యూహం!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసిపోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మిత్ర‌త్వం మ‌రింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఇక నుంచి ఏం చేయాల‌న్నా.. ఏవిష‌యంపై గ‌ళం విప్పాల‌న్నా.. ఏ అంశంపై పోరాటం చేయాల‌న్నా.. ఉమ్మ‌డిగానే ముందుకు సాగాల‌ని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాల‌ని తాజాగా నిర్ణ‌యించారు. దీనిపై తాజాగా హైద‌రాబాద్‌లో ఇరువురు నాయ‌కులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు సంయుక్తంగా భేటీ కావాల‌ని నిర్ణ‌యించారు.

ఈనెల 9వ తేదీన‌ విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సంయుక్తంగా కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు.

రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌లు సంయుక్తంగా ఈసీ బృందాన్ని క‌లిసి.. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇదిలావుంటే, ఈ నెల 9వ‌ తేదీన ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో టీడీపీ నిర్వహించాల్సిన ‘రా.. కదలిరా..’ కార్యక్రమం వాయిదా వేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి చంద్ర‌బాబు ఈసీని క‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో ఈ స‌భ‌ను వాయిదా వేశారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.

This post was last modified on January 7, 2024 12:19 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago