Political News

ఏదైనా క‌లిసే.. బాబు, ప‌వ‌న్‌ల ఉమ్మ‌డి వ్యూహం!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసిపోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మిత్ర‌త్వం మ‌రింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఇక నుంచి ఏం చేయాల‌న్నా.. ఏవిష‌యంపై గ‌ళం విప్పాల‌న్నా.. ఏ అంశంపై పోరాటం చేయాల‌న్నా.. ఉమ్మ‌డిగానే ముందుకు సాగాల‌ని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాల‌ని తాజాగా నిర్ణ‌యించారు. దీనిపై తాజాగా హైద‌రాబాద్‌లో ఇరువురు నాయ‌కులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు సంయుక్తంగా భేటీ కావాల‌ని నిర్ణ‌యించారు.

ఈనెల 9వ తేదీన‌ విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సంయుక్తంగా కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు.

రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్‌, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌లు సంయుక్తంగా ఈసీ బృందాన్ని క‌లిసి.. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇదిలావుంటే, ఈ నెల 9వ‌ తేదీన ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో టీడీపీ నిర్వహించాల్సిన ‘రా.. కదలిరా..’ కార్యక్రమం వాయిదా వేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి చంద్ర‌బాబు ఈసీని క‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో ఈ స‌భ‌ను వాయిదా వేశారు. అయితే, అదే రోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.

This post was last modified on January 7, 2024 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago