ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకొంది. ఇది కాంగ్రెస్కు భారీగా కలిసి వచ్చిందనే అంచనాలు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో టీడీపీ నుంచే రావడం.. ఆయన ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబుకు సహకరించే విషయం ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. తాను వ్యక్తిగతంగా చంద్రబాబును అభిమానిస్తానని ఆయన చెప్పారు.
అయితే.. అదేసమయంలో తాను ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నానని రేవంత్ చెప్పారు. ఏపీ అనేది పొరుగు రాష్ట్రమని.. ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తనకు తెలియదని వ్యాఖ్యానించారు. 1995 తరువాత చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ లు పాలన పరంగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులని చెప్పారు. ప్రజల్లో తమకంటూ చెరగని ఓ ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ ముగ్గురునీ దృష్టిలో ఉంచుకుని పోల్చుకుంటే.. తనపై బాధత్య ఎక్కువగా ఉంటుందని రేవంత్ తెలిపారు. ఏమాత్రం తడబాటు పడినా.. రాష్ట్రానికే నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలో అనుసరించే విధానాలు, రాజకీయాలపై తాను జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చని తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మనో ధైర్యం వచ్చిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం వల్ల.. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అయితే, తమిళనాడు, కర్ణాటక రాజకీయాలు ఎలాగో.. ఏపీ రాజకీయాలు కూడా తనకు అలాగే అని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారని, వారి నిర్ణయాలు వారు తీసుకుంటారని, అంతకు మించి తాను ఎలాంటి బాధ్యతలు తీసుకునే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 7, 2024 12:18 pm
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు, కండువాలు మార్చేసిన జంపింగ్ జపాంగ్ల…
కడపలో అవినాష్ రెడ్డి కథ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అతను కోల్పోవాల్సిందేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. కడప…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన…
దేశమంతా ఈ ఆదివారం నీట్ - యూజీ పరీక్షలు జరిగాయి. దేశమంతా 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత…
దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో…
ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఓపెనింగ్స్ వస్తాయా రావా అనే టెన్షన్ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి…