Political News

బీజేపీకి గట్టి వాళ్ళే దొరుకుతున్నారా ?

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా తెలంగాణా బీజేపీకి గట్టి అభ్యర్ధులే దొరుకుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి ఆర్ధికంగా బాగా స్ధితిమంతులే పోటీలు పడుతున్నారు. సహజంగా అయితే ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్న వాళ్ళు  ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ తరపున పోటీచేయటానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ  రివర్సులో కొందరు కాంగ్రెస్ ను కాదని, బీఆర్ఎస్ ను వద్దనుకుని  బీజేపీ లో చేరటానికి ఎందుకింత ఇంట్రెస్టు చూపుతున్నట్లు ?

ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరి టికెట్ల కోసం ప్రయత్నించినా ఉపయోగం ఉండదనే. కారణం ఏమిటంటే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోనే ఉన్నా కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చాలా మీడియా సంస్ధలు ప్రీపోల్ సర్వేల్లో చెబుతున్నాయి. అందుకనే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని ఎంపీగా పోటీచేసి గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు.

మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేయటానికి డీపీఎస్, పల్లవి ఎడ్యుకేషన్ గ్రూప్ సంస్ధల ఛైర్మన్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో బాగా పాతుకుపోయిన మల్క కొమరయ్య ఉత్సాహం చూపిస్తున్నారు. ఈయనకు ఆర్ధికంగా ఎలాంటి లోటు లేదు. అలాగే తన సంస్ధల కారణంగా అంగబలానికి కూడా కొదవలేదు. ఇక జహీరాబాద్ ఎంపీగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈయన కూడా ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

అలాగే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి ఓల్డ్ సిటీలోని వ్యాపారవేత్త బాగా ఆసక్తి చూపుతున్నారట. ఈయనకు గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ గట్టి మద్దతిస్తున్నారట. విచిత్రం ఏమిటంటే జహీరాబాద్ ఎంపీగా చికోటి ప్రవీణ్ తో పాటు రాజాసింగ్ కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక నలుగురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో మళ్ళీ పోటీ చేయబోతున్నారు. పార్టీలోనే జితేందర్ రెడ్డి లాంటి  కొందరు పారిశ్రామికవేత్తలున్నారు. వీళ్ళు కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

2 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

5 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

7 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

8 hours ago