రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా తెలంగాణా బీజేపీకి గట్టి అభ్యర్ధులే దొరుకుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి ఆర్ధికంగా బాగా స్ధితిమంతులే పోటీలు పడుతున్నారు. సహజంగా అయితే ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్న వాళ్ళు ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ తరపున పోటీచేయటానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ రివర్సులో కొందరు కాంగ్రెస్ ను కాదని, బీఆర్ఎస్ ను వద్దనుకుని బీజేపీ లో చేరటానికి ఎందుకింత ఇంట్రెస్టు చూపుతున్నట్లు ?
ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరి టికెట్ల కోసం ప్రయత్నించినా ఉపయోగం ఉండదనే. కారణం ఏమిటంటే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోనే ఉన్నా కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చాలా మీడియా సంస్ధలు ప్రీపోల్ సర్వేల్లో చెబుతున్నాయి. అందుకనే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని ఎంపీగా పోటీచేసి గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు.
మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేయటానికి డీపీఎస్, పల్లవి ఎడ్యుకేషన్ గ్రూప్ సంస్ధల ఛైర్మన్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో బాగా పాతుకుపోయిన మల్క కొమరయ్య ఉత్సాహం చూపిస్తున్నారు. ఈయనకు ఆర్ధికంగా ఎలాంటి లోటు లేదు. అలాగే తన సంస్ధల కారణంగా అంగబలానికి కూడా కొదవలేదు. ఇక జహీరాబాద్ ఎంపీగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈయన కూడా ఆర్ధికంగా చాలా బలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
అలాగే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి ఓల్డ్ సిటీలోని వ్యాపారవేత్త బాగా ఆసక్తి చూపుతున్నారట. ఈయనకు గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ గట్టి మద్దతిస్తున్నారట. విచిత్రం ఏమిటంటే జహీరాబాద్ ఎంపీగా చికోటి ప్రవీణ్ తో పాటు రాజాసింగ్ కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక నలుగురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో మళ్ళీ పోటీ చేయబోతున్నారు. పార్టీలోనే జితేందర్ రెడ్డి లాంటి కొందరు పారిశ్రామికవేత్తలున్నారు. వీళ్ళు కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…