Political News

టీడీపీలోకి వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్‌?

ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ల కేటాయింపు న‌డుస్తోంది. ఇప్ప‌టికి చాలా మంది సిట్టింగుల‌ను పార్టీ ప‌క్క‌న పెట్టింది. స‌ర్వేల ఆధారంగా.. ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి కార‌ణంగా ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రిని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. దీంతో కొంద‌రు ఎమ్మెల్యేలు స‌ర్దుకు పోతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ఇలాంటి వారిలో ఇంకా టికెట్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌ని నాయ‌కుడు, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు కొలుసు పార్థ‌సార‌థి పేరు తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవల ఆయ‌న సీఎం జ‌గ‌న్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ప్ర‌జ‌లైనా ప‌ట్టించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాలు పార్టీలోనూ.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ‌కు దారితీశాయి. దీనిపై పార్టీ అధిష్టానం కొలుసును వివ‌ర‌ణ కూడా కోరింది. ఇక‌, టికెట్ వ్య‌వ‌హారంపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

అయితే.. ఎలానూ త‌న‌కు టికెట్ రాద‌ని అనుకున్నారో.. లేక‌.. వైసీపీలో ఉండి కూడా అన‌వ‌స‌రం అని భావించారో తెలియ‌దు కానీ.. కొలుసు పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలుముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆయ‌న హైద‌రాబాద్‌లో కలిసినట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌పై ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచారు.

పెనమలూరు లేదా నూజివీడు నియోజకవర్గాల నుంచి పార్థసారథి సీటు ఆశిస్తున్నారు. పెనమలూరు టికెట్ ఇవ్వరని టీడీపీ నేతలు చెబుతున్నారు. పెన‌మ‌లూరులో బ‌ల‌మైన నాయ‌కుడు బోడే ప్ర‌సాద్ ఉండ‌డంతో టీడీపీ ఇక్క‌డి సీటును ఎవ‌రికీ ఇచ్చే ప‌రిస్తితి లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నూజివీడు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. ఈ నెల 18వ తేదీన గుడివాడలో జరిగే సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా, ఇంతగా ప్ర‌చారం జ‌రుగుతున్నా కొలుసు మాత్రం మౌనంగా ఉన్నారు. దీనిని బ‌ట్టి ఆయ‌న పార్టీ మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on January 7, 2024 5:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

1 hour ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

3 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

4 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago