Political News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్‌.. కానీ!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్ ఇస్తామంటూ.. ఓ యూనివ‌ర్సిటీ ముందుకు వ‌చ్చింది. ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించింది. మీకు డాక్ట‌రేట్ ఇస్తాం తీసుకోండి.. అని తెలిపింది. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ ఆహ్వానం, ఆఫ‌ర్‌పై నిశితంగా స్పందించారు. త‌న‌కు ఈ డాక్ట‌రేట్ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. స‌మాజంలో త‌న‌క‌న్నా మేధావులు, నిపుణులు, విజ్ఞులు ఉన్నారని, వారిలో ఎవ‌రినైనా ఎంపిక చేసుకుని ఇవ్వాల‌ని సూచించారు. దీంతో స‌ద‌రు యూనివ‌ర్సిటీ వెన‌క్కిత‌గ్గింది.

ఇదీ విషయం..
తమిళనాడులోని ప్ర‌ముఖ ‘వేల్స్ యూనివర్సిటీ’ 14వ స్నాతకోత్సవానికి జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. అంతేకాదు.. తాము డాక్టరేట్ ఇవ్వాల‌ని భావిస్తున్నామ‌ని, దీనిని స్వీకరించాలని వర్సిటీ కోరింది. డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. ఈ మేరకు ప‌వ‌న్ స‌ద‌రు యూనివ‌ర్సిటీకి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తోన్నందున బిజీగా ఉన్నానని ప‌వ‌న్ త‌న‌ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీ స్నాతకోత్సవానికి రాలేనని తెలిపారు. సమాజంలో తనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు. కాగా, స‌ద‌రు యూనివ‌ర్సిటీ డాక్టరేట్ ప్ర‌క‌టించ‌డం వెనుక‌ పవన్ క‌ళ్యాణ్ చేసిన సహాయ, సేవా కార్యక్రమాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించడంపై అతని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.

This post was last modified on January 6, 2024 7:11 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

50 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

1 hour ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago