Political News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్‌.. కానీ!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్ ఇస్తామంటూ.. ఓ యూనివ‌ర్సిటీ ముందుకు వ‌చ్చింది. ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించింది. మీకు డాక్ట‌రేట్ ఇస్తాం తీసుకోండి.. అని తెలిపింది. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ ఆహ్వానం, ఆఫ‌ర్‌పై నిశితంగా స్పందించారు. త‌న‌కు ఈ డాక్ట‌రేట్ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. స‌మాజంలో త‌న‌క‌న్నా మేధావులు, నిపుణులు, విజ్ఞులు ఉన్నారని, వారిలో ఎవ‌రినైనా ఎంపిక చేసుకుని ఇవ్వాల‌ని సూచించారు. దీంతో స‌ద‌రు యూనివ‌ర్సిటీ వెన‌క్కిత‌గ్గింది.

ఇదీ విషయం..
తమిళనాడులోని ప్ర‌ముఖ ‘వేల్స్ యూనివర్సిటీ’ 14వ స్నాతకోత్సవానికి జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించింది. అంతేకాదు.. తాము డాక్టరేట్ ఇవ్వాల‌ని భావిస్తున్నామ‌ని, దీనిని స్వీకరించాలని వర్సిటీ కోరింది. డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించారు. ఈ మేరకు ప‌వ‌న్ స‌ద‌రు యూనివ‌ర్సిటీకి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తోన్నందున బిజీగా ఉన్నానని ప‌వ‌న్ త‌న‌ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీ స్నాతకోత్సవానికి రాలేనని తెలిపారు. సమాజంలో తనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు. కాగా, స‌ద‌రు యూనివ‌ర్సిటీ డాక్టరేట్ ప్ర‌క‌టించ‌డం వెనుక‌ పవన్ క‌ళ్యాణ్ చేసిన సహాయ, సేవా కార్యక్రమాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, డాక్టరేట్‌ను పవన్ కళ్యాణ్ తిరస్కరించడంపై అతని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.

This post was last modified on January 6, 2024 7:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

28 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago