Political News

టీడీపీతో టచ్ పై బాలినేని కామెంట్స్

మాజీ మంత్రి, సీఎం జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ అధిష్టానంపై అలకబూనిన బాలినేని ఇంకా అలకపానుపు దిగలేదని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు, ఈసారి ఎన్నికల్లో బాలినేనికి జగన్ టికెట్ వేరే నియోజకవర్గం నుంచి కేటాయించబోతున్నారని, అది ఇష్టంలేని బాలినేని పార్టీ వీడేందుకు కూడా సిద్ధమయ్యారని పుకార్లు వచ్చాయి.

తన సిట్టింగ్ స్థానం ఒంగోలు నుంచే రాబోయే ఎన్నికలలో కూడా బాలినేని పోటీ చేసేందుకు సుముఖత చూపుతుండగా, గిద్దలూరు నుంచి బాలినేని పోటీ చేస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే బాలినేని పార్టీ మారుతున్నారని, టీడీపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై స్పందించిన బాలినేని సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని, అందుకే మంత్రి పదవిని కూడా వదిలేసి జగన్ వెంట నడుస్తున్నానని బాలినేని చెప్పారు, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మారుస్తున్నారని, అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ జగన్ కు, పార్టీకి అండగా ఉండాలని బాలినేని పిలుపునిచ్చారు. అయితే, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని బాలినేని ఖండించారు. టిడిపి నేతలతో తాను టచ్ లో ఉన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీనిచ్చారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.

This post was last modified on January 8, 2024 10:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భర్త కోసం చైన్ స్నాచర్ గా మారిన భార్య!

తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…

1 hour ago

థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !

సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…

1 hour ago

సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…

3 hours ago

వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…

5 hours ago

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

6 hours ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

9 hours ago