Political News

టీడీపీతో టచ్ పై బాలినేని కామెంట్స్

మాజీ మంత్రి, సీఎం జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ అధిష్టానంపై అలకబూనిన బాలినేని ఇంకా అలకపానుపు దిగలేదని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు, ఈసారి ఎన్నికల్లో బాలినేనికి జగన్ టికెట్ వేరే నియోజకవర్గం నుంచి కేటాయించబోతున్నారని, అది ఇష్టంలేని బాలినేని పార్టీ వీడేందుకు కూడా సిద్ధమయ్యారని పుకార్లు వచ్చాయి.

తన సిట్టింగ్ స్థానం ఒంగోలు నుంచే రాబోయే ఎన్నికలలో కూడా బాలినేని పోటీ చేసేందుకు సుముఖత చూపుతుండగా, గిద్దలూరు నుంచి బాలినేని పోటీ చేస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే బాలినేని పార్టీ మారుతున్నారని, టీడీపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై స్పందించిన బాలినేని సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని, అందుకే మంత్రి పదవిని కూడా వదిలేసి జగన్ వెంట నడుస్తున్నానని బాలినేని చెప్పారు, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మారుస్తున్నారని, అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ జగన్ కు, పార్టీకి అండగా ఉండాలని బాలినేని పిలుపునిచ్చారు. అయితే, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని బాలినేని ఖండించారు. టిడిపి నేతలతో తాను టచ్ లో ఉన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీనిచ్చారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.

This post was last modified on January 8, 2024 10:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

12 minutes ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

21 minutes ago

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

1 hour ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

1 hour ago

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

1 hour ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

2 hours ago