ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. రాజకీయాల్లో ఎప్పుడూ ఈ నియోజకవర్గం హాట్ టాపిక్గానే ఉంటుంది. గత ఎన్నికల సమయంలోనూ దర్శి నియోజకవర్గం భారీ ఎత్తున రాజకీయాల కు కేంద్రంగా మారింది. తాజాగా కూడా ఈ నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న విద్యా సంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్.. వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ దర్శి టికెట్ వైసీపీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించేశారు. ఇది ఆయనకు మాత్రమే రిజర్వ్ చేసిన నియోజక వర్గం అనడంలోనూ సందేహం లేదు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయనని చెప్పిన దరిమిలా.. మద్దిశెట్టి ని తీసుకువచ్చి జగన్ టికెట్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే బూచేపల్లి పోటీకి సై అన్నారు. దీంతో ఆయనకే అప్రకటితంగా సీఎం జగన్ టికెట్ ఇచ్చారు.
దీంతో అలిగిన మద్దిశెట్టి.. తాజాగా సీఎం జగన్ను కలిసి.. తన అభ్యర్థన వినిపించారు. కానీ, ఆయనకు టికెట్ లేదని సీఎం జగన్ చెప్పారు. కానీ, మద్దిశెట్టి మాత్రం ఫైరయ్యారు. తనకు టికెట్ రావాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి సీఎం జగన్ కూడా పట్టుదలకు పోరాదని సూచించారు. మొత్తంగా టికెట్ విసయం అయితే తేల్చలేదు. ఇదిలావుంటే.. కొన్నాళ్ల కిందటి వరకు జనసేనతో టచ్లోకి వెళ్లిన మద్దిశెట్టి.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
కానీ, ఇంతలోనే స్థానికంగా ఉన్న మరో నాయకుడు జనసేనలో చేరి టికెట్ పై హామీ కూడా తెచ్చుకున్నా రు. దీని ప్రకారం చూస్తే.. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆయనే అయ్యే అవకాశం ఉంది. దీంతో మద్దిశెట్టి ఇప్పుడు పార్టీ మారే ఆలోచన చేసినా ప్రయోజనం లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే.. వైసీపీలోనే సర్దు కోవడం లేదా.. ఇండిపెండెంట్గా పోటీకి దిగడం.. ఇంతకు మించి మద్దిశెట్టికి మరో మార్గం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 23, 2024 6:36 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…