బీఆర్ఎస్ లో ఎంఎల్సీ ఎన్నికల టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. తొందరలో భర్తీ అవబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమిచేయాలో కేసీయార్ కు అర్ధంకావటం లేదట. ఇక్కడ క విచిత్రమైన పరిస్ధితి ఉంది. అదేమిటంటే ఎంఎల్ఏ కోటాలో జరగబోయే రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీ ఎన్నికలో ప్రతి ఎంఎల్సీ అభ్యర్ధికి 40 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ కు రెండు సీట్లను గెలుచుకునేంత సీన్ లేదు. బీఆర్ఎస్ కు అయితే అసలు ఒక్క స్థానం గెలిచే అవకాశం కూడా లేదు.
కాంగ్రెస్ లో 64 మంది ఎంఎల్ఏలున్నారు. కాబట్టి 40 ఓట్లుపోను ఇంకా 24 ఓట్లు మిగిలే ఉంటాయి. ఇక బీఆర్ఎస్ తరపున గెలిచింది 39 మంది ఎంఎల్ఏలు మాత్రమే. అంటే ఒక్క సీటు గెలుచుకునేందుకు కారుపార్టీకి ఒక్క ఓటు అవసరం. మామూలుగా అయితే ఈ ఒక్క ఓటు తెచ్చుకోవటం బీఆర్ఎస్ కు పెద్ద కష్టంకాదు. ఎలాగంటే మజ్లిస్ మద్దతుతో. కానీ మారిన పరిస్ధితుల్లో మజ్లిస్ బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు మారగనే మజ్లిస్ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించేసింది. ఇపుడు టీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ తో తంటా. కాబట్టి ఎంఐఎం మద్దతు దొరుకుతుందని అనుకునేందుకు లేదు.
ఇంతవరకు లెక్కలు స్పష్టంగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ గనుక రెండో అభ్యర్ధిని కూడా పోటీలోకి దింపితే ఏమి చేయాలన్న విషయంలోనే కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోందట. ఎందుకంటే అవసరమైన 16 ఓట్ల వ్యవహారాన్ని చూసుకునే కాంగ్రెస్ రెండో అభ్యర్ధిని పోటీలోకి దింపుతుందని అర్ధమైపోతుంది. అవసరమైన 16 ఓట్లంటే అవి బీఆర్ఎస్ నుండి లాక్కునే వ్యూహం పన్నితేనే రెండో అభ్యర్ధిని రెడీ చేస్తుంది.
అదే జరిగితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు క్రాస్ ఓట్లు వేసేది ఎవరు ? అన్నదే ఇపుడు కీలకమైన పాయింట్. గతంతో క్రాస్ ఓటింగ్ కు, ఫిరాయింపులను కేసీయార్ యధేచ్చగా ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తే తమ పరిస్ధితి ఏమిటన్నదే కేసీయార్ కు అర్ధంకావటంలేదని సమాచారం. గెలిచిన 39 మందిలో 16 మంది జారిపోతే మిగిలేది 23 మంది మాత్రమే. వీరిలోకూడా ఎంతమంది పార్టీలోనే ఉంటారన్నది అనుమానమే. మొత్తంమీద ఇలాంటి లెక్కలే ఇపుడు కేసీయార్లో టెన్షన్ పెంచేస్తోందట.
This post was last modified on January 7, 2024 4:20 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…