Political News

ఆ టీడీపీ వార‌సుడి విక్ట‌రీ రాసిపెట్టుకోవ‌చ్చా…!

రాజ‌కీయాల్లో మార్పులు.. చేర్పులు స‌హ‌జ‌మే. అయితే.. ఈ మార్పులు ప్ర‌త్య‌ర్థి పార్టీకి బ‌లాన్ని చేకూర్చ‌డ మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ అభ్య‌ర్థులు, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మారుస్తూ.. వైసీపీ సంచల‌నాల‌కు తెర‌దీసింది. దీనిలో భాగంగా కీల‌కమైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని కూడా మార్పు చేసింది. సిట్టింగ్ ఎంపీ త‌లారి రంగ‌య్య‌ను క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా పంపిస్తూ.. ఈ స్థానంలో ఎమ్మెల్యే ను తీసుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత‌పురం లోక్‌స‌భ అభ్య‌ర్థిగా నిల‌బెట్టారు. వాస్త‌వానికి పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంక‌ర‌నారాయ‌ణ‌కు స్థానికంగా పార్టీలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. చాలా మంది నాయ‌కులు ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించి.. పార్టీ అధి ష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. అలాంటి నాయ‌కుడిని తీసుకువ‌చ్చి ఏకంగా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్ట‌డం.. పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఇక‌, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం.. స్థానిక జేసీ ప‌వ‌న్‌కుమార్‌కు బూస్ట్ ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జేసీ ప‌వ‌న్‌కుమార్ ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి కార‌ణం.. త‌లారి రంగ‌య్య వంటి కీల‌క మాజీ అధికారికి వైసీపీ టికెట్ ఇవ్వ‌డ‌మ‌నే చ‌ర్చ సాగింది. పైగా.. అప్ప‌ట్లో కొంత వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు కూడా ఉన్నాయి. దీంతో త‌రాలి రంగ‌య్య విజ‌యం ద‌క్కించుకున్నా రు.

కానీ, ఇప్పుడు వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న శంక‌ర‌నారాయ‌ణ‌కు కీల‌క‌మైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని క‌ట్ట‌బెట్ట‌డం.. స్థానికంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త కొన‌సాగుతుండ‌డం.. పైగా.. జేసీ వ‌ర్గానికి మ‌రింత బ‌లం పెర‌గ‌డం నేప‌థ్యంలో అనంత‌పురంలో జేసీ ప‌వ‌న్ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోం ది. ఇదే జేసీ ప‌వ‌న్‌కు కూడా బ‌లాన్ని చేకూరుస్తోంది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌లు ముందుగానే తెలిసి ఉండడం.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌పై కొంత వ్య‌తిరేక‌త స‌హ‌జంగా ఉండ‌డంతో జేసీ ప‌వ‌న్ కూడా హ్యాపీగానే ఉన్నార‌ని ఆ వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 8, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: JC Pawan

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

2 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

7 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

9 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

13 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

14 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

14 hours ago