Political News

ఆ టీడీపీ వార‌సుడి విక్ట‌రీ రాసిపెట్టుకోవ‌చ్చా…!

రాజ‌కీయాల్లో మార్పులు.. చేర్పులు స‌హ‌జ‌మే. అయితే.. ఈ మార్పులు ప్ర‌త్య‌ర్థి పార్టీకి బ‌లాన్ని చేకూర్చ‌డ మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ అభ్య‌ర్థులు, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మారుస్తూ.. వైసీపీ సంచల‌నాల‌కు తెర‌దీసింది. దీనిలో భాగంగా కీల‌కమైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని కూడా మార్పు చేసింది. సిట్టింగ్ ఎంపీ త‌లారి రంగ‌య్య‌ను క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా పంపిస్తూ.. ఈ స్థానంలో ఎమ్మెల్యే ను తీసుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత‌పురం లోక్‌స‌భ అభ్య‌ర్థిగా నిల‌బెట్టారు. వాస్త‌వానికి పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంక‌ర‌నారాయ‌ణ‌కు స్థానికంగా పార్టీలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. చాలా మంది నాయ‌కులు ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించి.. పార్టీ అధి ష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. అలాంటి నాయ‌కుడిని తీసుకువ‌చ్చి ఏకంగా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్ట‌డం.. పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఇక‌, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం.. స్థానిక జేసీ ప‌వ‌న్‌కుమార్‌కు బూస్ట్ ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జేసీ ప‌వ‌న్‌కుమార్ ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి కార‌ణం.. త‌లారి రంగ‌య్య వంటి కీల‌క మాజీ అధికారికి వైసీపీ టికెట్ ఇవ్వ‌డ‌మ‌నే చ‌ర్చ సాగింది. పైగా.. అప్ప‌ట్లో కొంత వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు కూడా ఉన్నాయి. దీంతో త‌రాలి రంగ‌య్య విజ‌యం ద‌క్కించుకున్నా రు.

కానీ, ఇప్పుడు వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న శంక‌ర‌నారాయ‌ణ‌కు కీల‌క‌మైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని క‌ట్ట‌బెట్ట‌డం.. స్థానికంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త కొన‌సాగుతుండ‌డం.. పైగా.. జేసీ వ‌ర్గానికి మ‌రింత బ‌లం పెర‌గ‌డం నేప‌థ్యంలో అనంత‌పురంలో జేసీ ప‌వ‌న్ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోం ది. ఇదే జేసీ ప‌వ‌న్‌కు కూడా బ‌లాన్ని చేకూరుస్తోంది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌లు ముందుగానే తెలిసి ఉండడం.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌పై కొంత వ్య‌తిరేక‌త స‌హ‌జంగా ఉండ‌డంతో జేసీ ప‌వ‌న్ కూడా హ్యాపీగానే ఉన్నార‌ని ఆ వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

29 minutes ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

4 hours ago

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

12 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

13 hours ago

నిషేధం చిన్న చ‌ర్యే: టెలిగ్రామ్ యాప్‌కు కోర్టు షాక్‌!

త‌మ‌పై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాల‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌పై నిషేధం విధించింద‌ని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును…

13 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

15 hours ago