Political News

ఆ టీడీపీ వార‌సుడి విక్ట‌రీ రాసిపెట్టుకోవ‌చ్చా…!

రాజ‌కీయాల్లో మార్పులు.. చేర్పులు స‌హ‌జ‌మే. అయితే.. ఈ మార్పులు ప్ర‌త్య‌ర్థి పార్టీకి బ‌లాన్ని చేకూర్చ‌డ మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ అభ్య‌ర్థులు, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మారుస్తూ.. వైసీపీ సంచల‌నాల‌కు తెర‌దీసింది. దీనిలో భాగంగా కీల‌కమైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని కూడా మార్పు చేసింది. సిట్టింగ్ ఎంపీ త‌లారి రంగ‌య్య‌ను క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా పంపిస్తూ.. ఈ స్థానంలో ఎమ్మెల్యే ను తీసుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత‌పురం లోక్‌స‌భ అభ్య‌ర్థిగా నిల‌బెట్టారు. వాస్త‌వానికి పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంక‌ర‌నారాయ‌ణ‌కు స్థానికంగా పార్టీలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. చాలా మంది నాయ‌కులు ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించి.. పార్టీ అధి ష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. అలాంటి నాయ‌కుడిని తీసుకువ‌చ్చి ఏకంగా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్ట‌డం.. పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఇక‌, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం.. స్థానిక జేసీ ప‌వ‌న్‌కుమార్‌కు బూస్ట్ ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జేసీ ప‌వ‌న్‌కుమార్ ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి కార‌ణం.. త‌లారి రంగ‌య్య వంటి కీల‌క మాజీ అధికారికి వైసీపీ టికెట్ ఇవ్వ‌డ‌మ‌నే చ‌ర్చ సాగింది. పైగా.. అప్ప‌ట్లో కొంత వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు కూడా ఉన్నాయి. దీంతో త‌రాలి రంగ‌య్య విజ‌యం ద‌క్కించుకున్నా రు.

కానీ, ఇప్పుడు వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న శంక‌ర‌నారాయ‌ణ‌కు కీల‌క‌మైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని క‌ట్ట‌బెట్ట‌డం.. స్థానికంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త కొన‌సాగుతుండ‌డం.. పైగా.. జేసీ వ‌ర్గానికి మ‌రింత బ‌లం పెర‌గ‌డం నేప‌థ్యంలో అనంత‌పురంలో జేసీ ప‌వ‌న్ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోం ది. ఇదే జేసీ ప‌వ‌న్‌కు కూడా బ‌లాన్ని చేకూరుస్తోంది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌లు ముందుగానే తెలిసి ఉండడం.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌పై కొంత వ్య‌తిరేక‌త స‌హ‌జంగా ఉండ‌డంతో జేసీ ప‌వ‌న్ కూడా హ్యాపీగానే ఉన్నార‌ని ఆ వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 8, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: JC Pawan

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago