Political News

ఆ టీడీపీ వార‌సుడి విక్ట‌రీ రాసిపెట్టుకోవ‌చ్చా…!

రాజ‌కీయాల్లో మార్పులు.. చేర్పులు స‌హ‌జ‌మే. అయితే.. ఈ మార్పులు ప్ర‌త్య‌ర్థి పార్టీకి బ‌లాన్ని చేకూర్చ‌డ మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ అభ్య‌ర్థులు, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మారుస్తూ.. వైసీపీ సంచల‌నాల‌కు తెర‌దీసింది. దీనిలో భాగంగా కీల‌కమైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని కూడా మార్పు చేసింది. సిట్టింగ్ ఎంపీ త‌లారి రంగ‌య్య‌ను క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా పంపిస్తూ.. ఈ స్థానంలో ఎమ్మెల్యే ను తీసుకువ‌చ్చింది.

ప్ర‌స్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌ను అనంత‌పురం లోక్‌స‌భ అభ్య‌ర్థిగా నిల‌బెట్టారు. వాస్త‌వానికి పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంక‌ర‌నారాయ‌ణ‌కు స్థానికంగా పార్టీలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. చాలా మంది నాయ‌కులు ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించి.. పార్టీ అధి ష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే.. అలాంటి నాయ‌కుడిని తీసుకువ‌చ్చి ఏకంగా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్ట‌డం.. పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఇక‌, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణ‌యం.. స్థానిక జేసీ ప‌వ‌న్‌కుమార్‌కు బూస్ట్ ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జేసీ ప‌వ‌న్‌కుమార్ ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి కార‌ణం.. త‌లారి రంగ‌య్య వంటి కీల‌క మాజీ అధికారికి వైసీపీ టికెట్ ఇవ్వ‌డ‌మ‌నే చ‌ర్చ సాగింది. పైగా.. అప్ప‌ట్లో కొంత వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు కూడా ఉన్నాయి. దీంతో త‌రాలి రంగ‌య్య విజ‌యం ద‌క్కించుకున్నా రు.

కానీ, ఇప్పుడు వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న శంక‌ర‌నారాయ‌ణ‌కు కీల‌క‌మైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని క‌ట్ట‌బెట్ట‌డం.. స్థానికంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త కొన‌సాగుతుండ‌డం.. పైగా.. జేసీ వ‌ర్గానికి మ‌రింత బ‌లం పెర‌గ‌డం నేప‌థ్యంలో అనంత‌పురంలో జేసీ ప‌వ‌న్ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోం ది. ఇదే జేసీ ప‌వ‌న్‌కు కూడా బ‌లాన్ని చేకూరుస్తోంది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌లు ముందుగానే తెలిసి ఉండడం.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌పై కొంత వ్య‌తిరేక‌త స‌హ‌జంగా ఉండ‌డంతో జేసీ ప‌వ‌న్ కూడా హ్యాపీగానే ఉన్నార‌ని ఆ వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 8, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: JC Pawan

Recent Posts

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

10 minutes ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

39 minutes ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

1 hour ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

1 hour ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

2 hours ago

కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?

తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…

2 hours ago