Political News

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?

బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదోపిడీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన ఐదేళ్ళల్లో 2018-23 మధ్య కేసీయార్ హయాంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి అండ్ కో చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రేవంత్ అండ్ కో మాత్రమే కాదు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కూడా ఇవే ఆరోపణలు చేశాయి. అధికారంలోకి రాగానే భూదోపిడీపై విచారణ చేయిస్తామని అప్పట్లోనే రేవంత్ పదేపదే ప్రకటించారు.

అప్పుడు చేసిన ప్రకటనకు ఇపుడు కార్యరూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజి కి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. గడచిన ఐదేళ్ళల్లో భూములు రిజిస్ట్రేషన్లు చేసుకున్న అధికారపార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు, ముఖ్యనేతల బినామీలుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులతో పాటు రియల్ ఎస్టేట్ సంస్ధలపై పూర్తి వివరాలు అందచేయాలని చెప్పారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు వివిధ జిల్లాల హెడ్ క్వార్టర్స్ తో పాటు డిమాండున్న ప్రాంతాల్లోని భూములపై జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించి తనకు ఇవ్వాలని చెప్పారట.

రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి వివరాలను, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ను కూడా విచారించి తనకు నివేదిక ఇవ్వమని చెప్పారట. కాంగ్రెస్ ఆరోపణ ప్రకారం కేసీయార్ హయాంలో సుమారు 10 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయలుంటాయని అంచనా. అనుమానంగా ఉన్న లావాదేవీలపై లోతుగా విచారణ జరిపి తన నివేదికను ఇవ్వమని రేవంత్ ఆదేశించారట.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ జిల్లాల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు వెంటనే అవసరమైన ఆదేశాలను జారీచేశారట. మొత్తం పదిరోజుల్లో అవసరమైన వివరాలను సేకరించి, విచారణ జరిపింది నివేదికను తయారుచేసే పనిలో డీఐజీ ఆఫీసు బిజీ అయిపోయింది. అన్నీ వివరాలు అందుబాటులోకి వస్తే భూదోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, వాళ్ళ బినామీల వివరాలన్నీ బయటపడతాయని రేవంత్ అనుకుంటున్నారు. మరి చివరకు ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో చూడాలి.

This post was last modified on January 6, 2024 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

2 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

3 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

4 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

5 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

6 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

6 hours ago