Political News

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?

బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదోపిడీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన ఐదేళ్ళల్లో 2018-23 మధ్య కేసీయార్ హయాంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి అండ్ కో చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క రేవంత్ అండ్ కో మాత్రమే కాదు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కూడా ఇవే ఆరోపణలు చేశాయి. అధికారంలోకి రాగానే భూదోపిడీపై విచారణ చేయిస్తామని అప్పట్లోనే రేవంత్ పదేపదే ప్రకటించారు.

అప్పుడు చేసిన ప్రకటనకు ఇపుడు కార్యరూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజి కి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. గడచిన ఐదేళ్ళల్లో భూములు రిజిస్ట్రేషన్లు చేసుకున్న అధికారపార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు, ముఖ్యనేతల బినామీలుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులతో పాటు రియల్ ఎస్టేట్ సంస్ధలపై పూర్తి వివరాలు అందచేయాలని చెప్పారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు వివిధ జిల్లాల హెడ్ క్వార్టర్స్ తో పాటు డిమాండున్న ప్రాంతాల్లోని భూములపై జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించి తనకు ఇవ్వాలని చెప్పారట.

రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారి వివరాలను, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ను కూడా విచారించి తనకు నివేదిక ఇవ్వమని చెప్పారట. కాంగ్రెస్ ఆరోపణ ప్రకారం కేసీయార్ హయాంలో సుమారు 10 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువ వేల కోట్ల రూపాయలుంటాయని అంచనా. అనుమానంగా ఉన్న లావాదేవీలపై లోతుగా విచారణ జరిపి తన నివేదికను ఇవ్వమని రేవంత్ ఆదేశించారట.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ జిల్లాల రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు వెంటనే అవసరమైన ఆదేశాలను జారీచేశారట. మొత్తం పదిరోజుల్లో అవసరమైన వివరాలను సేకరించి, విచారణ జరిపింది నివేదికను తయారుచేసే పనిలో డీఐజీ ఆఫీసు బిజీ అయిపోయింది. అన్నీ వివరాలు అందుబాటులోకి వస్తే భూదోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, వాళ్ళ బినామీల వివరాలన్నీ బయటపడతాయని రేవంత్ అనుకుంటున్నారు. మరి చివరకు ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో చూడాలి.

This post was last modified on January 6, 2024 10:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

27 minutes ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

38 minutes ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

1 hour ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

2 hours ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

3 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

4 hours ago