Political News

అది తేల్చకుండా రా.. క‌ద‌లి రా… అంటే ఎలా బాబు?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ శుక్ర‌వారం నుంచి ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. అదే.. రా.. క‌ద‌లిరా! పేరుతో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లు. స‌మావేశాలు. నాయ‌కుల చేరిక‌లు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని మ‌రింత చేరువ చేయ‌డం. 1982-83 మ‌ధ్య కాలంలో దివంగ‌త ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించారు. ఈ స‌మ యంలో ఆయ‌న చైత‌న్య ర‌థంపై రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న రా.. క‌ద‌లిరా! నినాదంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు.

అప్ప‌ట్లో అది నినాదం మాత్ర‌మే. కానీ, అదే నినాదాన్ని ఇప్పుడు టీడీపీ కార్య‌క్ర‌మం రూపంలో మ‌లిచి ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు రెడీ అయింది. ఈ కార్యక్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం.. పార్టీని మ‌రింత‌గా ప్ర‌జ‌ల కు చేరువ చేయ‌డం.. అదేస‌మ‌యంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల‌కు పార్టీ ప్రాధాన్యాన్ని వివ‌రించడంతో పాటు గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వారికి చెప్పి.. మ‌రోసారి టీడీపీకి అనుకూలం గా మార్చాల‌నేది ప్ర‌ధాన సంక‌ల్పం.

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 12 రోజుల పాటు ఉద‌యం, సాయంత్రం కూడా భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించి.. జ‌న స‌మీక‌ర‌ణ చేయ‌డం ద్వారా పార్టీని మ‌రోసా రి అధికారంలోకి తీసుకురావాల‌నేది టీడీపీ వ్యూహం. దీనికి సంబంధించి ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌ను పార్టీ నిర్దేశించుకుంది. ఇంత వ‌ర‌కు ల‌క్ష్యం బాగానే ఉన్నా.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి కొన్ని చిన్న‌పాటి స‌మ‌స్య‌లు కూడా క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం నాయ‌కుల్లో నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌గా ఉంది.

కోరుకున్న సీటు ద‌క్కుతుందా? లేదా? అనే స‌మ‌స్య ఆలోచ‌న దాదాపు 60 నుంచి 70 మంది నాయ‌కుల‌కు ఉంది. దీంతో వారంతా పార్టీకి అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చం ద్రబాబు ప‌ర్య‌టిస్తున్నా.. నారా లోకేష్ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నా.. వీరిలో చాలా మంది క‌డు దూరం లో ఉంటున్నారు. కొంద‌రు రెండేసి టికెట్లు ఆశిస్తున్నారు. మ‌రికొంద‌రు త‌మ వార‌సుల‌ను రంగం లోకి దింపాల‌ని అనుకుంటున్నారు.

ఇంకొన్ని స్థానాల్లో త‌మ‌ను మారుస్తారా? లేక పొత్తులో ఉన్న పార్టీకి టికెట్ ఇచ్చేస్తారా? అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ విష‌యాన్ని తేల్చ‌కుండా.. ఇంత ప్రతిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ డం ద్వారా పార్టీకి ఎంత వ‌ర‌కు ల‌క్ష్య సాధాన సాధ్యమ‌వుతుంద‌నేది ప్ర‌దాన ప్ర‌శ్న‌గా మారింది. ముందుగా నాయ‌కుల‌తో చ‌ర్చించాల‌నే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అసంతృప్తుల‌ను స‌రిచేయ‌డం ద్వారానే రా.. క‌ద‌లిరా! కార్య‌క్ర‌మం మ‌రింత విజ‌య‌వంతం అవుతుంద‌నేది మెజారిటీ నేత‌ల సూచ‌న‌గా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on January 6, 2024 8:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

47 minutes ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

59 minutes ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

1 hour ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

3 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

3 hours ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

5 hours ago