Political News

తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ – బాబు భరోసా

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ‘రా.. క‌ద‌లిరా!’ తొలి స‌భ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత భారీగా నిర్వ‌హించారు. వేలాది మందిని స‌మీక‌రించారు. ఈ స‌భ‌లో చంద్ర‌బాబు ఆద్యంతం అత్యంత ఉద్వేగ భ‌రితంగా మాట్లాడారు. వైసీపీ స‌ర్కారుపైనా.. సీఎం జ‌గ‌న్ పైనా ఆయ‌న నిప్పులు కురిపించారు. ఏపీని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 30 ఏళ్ల వెన‌క్కి తీసుకువెళ్లార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌పై వరాల జ‌ల్లు కురిపించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే….జగన్ గంజాయి ఇస్తున్నాడని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయ‌న్నారు. జగన్ దోపిడీ వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయని, చెత్త నుంచి సంపద సృష్టించాలని తాము ప్రయత్నించామ‌న్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి 5000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడని విమ‌ర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది” అని చంద్రబాబు తెలిపారు. “2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మోసపోయామని ప్ర‌జ‌లే చెబుతున్నారు. ఇంత‌క‌న్నా ఒక ప్ర‌భుత్వానికి ఏం కావాలి. ఇదే చెంప‌పెట్టు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు” అని నిప్పులు చెరిగారు.

నేను భ‌యప‌డ‌ను!
ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తూనే చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. “నేను సైకోకి భయపడను. సైకో పోవాలి…. సైకిల్ రావాలి. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా.. ఇతర ప్రాంతాల వలస వెళ్లి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత‌ కనిగిరి రూపురేఖలు మారుస్తాను. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటిసారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి జగన్ ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి.. 100 దోచుకుంటున్నారు“ అని విమ‌ర్శించారు.

This post was last modified on January 5, 2024 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

2 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

6 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

8 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

13 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

14 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

14 hours ago