Political News

తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ – బాబు భరోసా

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ‘రా.. క‌ద‌లిరా!’ తొలి స‌భ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత భారీగా నిర్వ‌హించారు. వేలాది మందిని స‌మీక‌రించారు. ఈ స‌భ‌లో చంద్ర‌బాబు ఆద్యంతం అత్యంత ఉద్వేగ భ‌రితంగా మాట్లాడారు. వైసీపీ స‌ర్కారుపైనా.. సీఎం జ‌గ‌న్ పైనా ఆయ‌న నిప్పులు కురిపించారు. ఏపీని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 30 ఏళ్ల వెన‌క్కి తీసుకువెళ్లార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌పై వరాల జ‌ల్లు కురిపించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే….జగన్ గంజాయి ఇస్తున్నాడని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయ‌న్నారు. జగన్ దోపిడీ వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయని, చెత్త నుంచి సంపద సృష్టించాలని తాము ప్రయత్నించామ‌న్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి 5000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడని విమ‌ర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది” అని చంద్రబాబు తెలిపారు. “2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మోసపోయామని ప్ర‌జ‌లే చెబుతున్నారు. ఇంత‌క‌న్నా ఒక ప్ర‌భుత్వానికి ఏం కావాలి. ఇదే చెంప‌పెట్టు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు” అని నిప్పులు చెరిగారు.

నేను భ‌యప‌డ‌ను!
ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తూనే చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. “నేను సైకోకి భయపడను. సైకో పోవాలి…. సైకిల్ రావాలి. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా.. ఇతర ప్రాంతాల వలస వెళ్లి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత‌ కనిగిరి రూపురేఖలు మారుస్తాను. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటిసారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి జగన్ ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి.. 100 దోచుకుంటున్నారు“ అని విమ‌ర్శించారు.

This post was last modified on January 5, 2024 10:33 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

2 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

2 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

3 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

4 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

4 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

6 hours ago