Political News

ష‌ర్మిల గురించి రాజారెడ్డి.. వైఎస్ ఆత్మ‌ల‌తో మాట్లాడా.. : పాల్

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల‌పై పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన స‌మ‌యంలో ష‌ర్మిల డిస్కో డ్యాన్స్ చేస్తుంద‌ని అనుకున్నాన‌ని వ్యాఖ్యానించా రు. అస‌లు ఏముంద‌ని వైఎస్సార్ తెలంగాణ‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింద‌న్నారు. అయినా.. పోయి పోయి.. కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయ‌లేద‌ని, కాంగ్రెస్‌కు అమ్మేసింద‌ని పాల్ విమ‌ర్శించారు. “షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా?” అని పాల్ ప్ర‌శ్నించారు. తాను రాజారెడ్డి, వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మలతో మాట్లాడుతానని పాల్ చెప్పుకొచ్చారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని అన్నారు. “వారి ఆత్మ ఘోషిస్తోంది. ష‌ర్మిల ఇలా చేసినందుకు వారు బాధ‌ప‌డుతున్నారు. ష‌ర్మిల ప్ర‌జాశాంతి పార్టీలోకి వ‌చ్చి ఉంటే .. రాజ‌కీయంగా గుర్తింపు వ‌చ్చి ఉండేది” అని అన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే ష‌ర్మిల కాంగ్రెస్ లో చేరార‌ని పాల్ విమ‌ర్శించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని తీవ్ర విమ‌ర్శలు చేశారు. “కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డిస్కో డాన్స్ చేయాల్సి ఉంది. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదు. వైఎస్ పేరుని చార్జిషీట్‌లో సోనియా పెట్టించింది” అని పాల్ దుయ్య‌బ‌ట్టారు.

వైఎస్ కు, త‌న‌కు మధ్య గొడవలకు కారణం సోనియానేన‌ని పాల్ చెప్పారు. “జగన్ అంటే ఇష్టం లేని వారు నిర్భ‌యంగా ప్ర‌జాశాంతి పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో కానీ చేరాలి. కాంగ్రెస్‌లో ఎవరూ చేర‌ద్దు” అని పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని, అయితే, అది ఏ పార్టీ అనేది తాను వెల్ల‌డించ‌న‌ని పాల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజా శాంతి గెలిపించాలని ఆయ‌న పిలుపునిచ్చారు.

This post was last modified on January 5, 2024 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago