Political News

ష‌ర్మిల గురించి రాజారెడ్డి.. వైఎస్ ఆత్మ‌ల‌తో మాట్లాడా.. : పాల్

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కురాలు వైఎస్ ష‌ర్మిల‌పై పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన స‌మ‌యంలో ష‌ర్మిల డిస్కో డ్యాన్స్ చేస్తుంద‌ని అనుకున్నాన‌ని వ్యాఖ్యానించా రు. అస‌లు ఏముంద‌ని వైఎస్సార్ తెలంగాణ‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింద‌న్నారు. అయినా.. పోయి పోయి.. కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయ‌లేద‌ని, కాంగ్రెస్‌కు అమ్మేసింద‌ని పాల్ విమ‌ర్శించారు. “షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా?” అని పాల్ ప్ర‌శ్నించారు. తాను రాజారెడ్డి, వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆత్మలతో మాట్లాడుతానని పాల్ చెప్పుకొచ్చారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని అన్నారు. “వారి ఆత్మ ఘోషిస్తోంది. ష‌ర్మిల ఇలా చేసినందుకు వారు బాధ‌ప‌డుతున్నారు. ష‌ర్మిల ప్ర‌జాశాంతి పార్టీలోకి వ‌చ్చి ఉంటే .. రాజ‌కీయంగా గుర్తింపు వ‌చ్చి ఉండేది” అని అన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే ష‌ర్మిల కాంగ్రెస్ లో చేరార‌ని పాల్ విమ‌ర్శించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని తీవ్ర విమ‌ర్శలు చేశారు. “కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డిస్కో డాన్స్ చేయాల్సి ఉంది. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదు. వైఎస్ పేరుని చార్జిషీట్‌లో సోనియా పెట్టించింది” అని పాల్ దుయ్య‌బ‌ట్టారు.

వైఎస్ కు, త‌న‌కు మధ్య గొడవలకు కారణం సోనియానేన‌ని పాల్ చెప్పారు. “జగన్ అంటే ఇష్టం లేని వారు నిర్భ‌యంగా ప్ర‌జాశాంతి పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో కానీ చేరాలి. కాంగ్రెస్‌లో ఎవరూ చేర‌ద్దు” అని పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని, అయితే, అది ఏ పార్టీ అనేది తాను వెల్ల‌డించ‌న‌ని పాల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజా శాంతి గెలిపించాలని ఆయ‌న పిలుపునిచ్చారు.

This post was last modified on January 5, 2024 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

3 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

4 hours ago

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

10 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

12 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

12 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

13 hours ago