వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలపై పొలిటికల్ కమెడియన్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సటైర్లతో విరుచుకుపడ్డారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో షర్మిల డిస్కో డ్యాన్స్ చేస్తుందని అనుకున్నానని వ్యాఖ్యానించా రు. అసలు ఏముందని వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందన్నారు. అయినా.. పోయి పోయి.. కాంగ్రెస్లో విలీనం చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయలేదని, కాంగ్రెస్కు అమ్మేసిందని పాల్ విమర్శించారు. “షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా?” అని పాల్ ప్రశ్నించారు. తాను రాజారెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మలతో మాట్లాడుతానని పాల్ చెప్పుకొచ్చారు. వారు బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని అన్నారు. “వారి ఆత్మ ఘోషిస్తోంది. షర్మిల ఇలా చేసినందుకు వారు బాధపడుతున్నారు. షర్మిల ప్రజాశాంతి పార్టీలోకి వచ్చి ఉంటే .. రాజకీయంగా గుర్తింపు వచ్చి ఉండేది” అని అన్నారు.
రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరారని పాల్ విమర్శించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. “కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డిస్కో డాన్స్ చేయాల్సి ఉంది. వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలడం లేదు. వైఎస్ పేరుని చార్జిషీట్లో సోనియా పెట్టించింది” అని పాల్ దుయ్యబట్టారు.
వైఎస్ కు, తనకు మధ్య గొడవలకు కారణం సోనియానేనని పాల్ చెప్పారు. “జగన్ అంటే ఇష్టం లేని వారు నిర్భయంగా ప్రజాశాంతి పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో కానీ చేరాలి. కాంగ్రెస్లో ఎవరూ చేరద్దు” అని పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రి చేస్తామని తనకు ఆఫర్ ఇచ్చారని, అయితే, అది ఏ పార్టీ అనేది తాను వెల్లడించనని పాల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజా శాంతి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
This post was last modified on January 5, 2024 4:52 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…