మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కేటీయార్ వైఖరిని దుమ్ము దులిపేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేటీయార్ స్వయంకృతమనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ చేస్తున్న ప్రతి విమర్శా రివర్సు కొడుతోంది. అందుకనే కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీయార్ తాజాగా 420 పేరుతో ఒక బుక్ లెట్ విడుదల చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసాలే(420) అని ఆ పుస్తకంలో రెచ్చిపోయారు. వందరోజుల్లో సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలను మోసంచేసిందని గోలగోల చేశారు. ఇక్కడే కేటీయార్ సెల్ఫ్ గోల్ బయటపడింది. కారణం ఏమిటంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ పార్టీ కూడా వందరోజుల్లో అమలుచేయటం సాధ్యంకాదు. ఎన్నికల్లో గెలుపుకు పార్టీలు అనేక హామీలిస్తుంటాయి. అయితే అందులో కీలకమైనవి ఏవి ? వాటి అమలుకు ఏమిచేస్తోందన్నది చాలా ముఖ్యం.
ఈ లెక్కన చూస్తే సిక్స్ గ్యారెంటీస్ లో ఇప్పటికే రెండింటిని అమల్లోకి తెచ్చేసింది. రు. 500కే గ్యాస్ అన్న పథకం అమలుకు కసరత్తు చేస్తోంది. గృహలక్ష్మి పేరుతో మహిళలకు ఇస్తామని చెప్పిన నెలకు రు. 2500 హామీ అమలుకు విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది. సిక్స్ గ్యారెంటీస్ అమలులో కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉందన్న విషయం అర్ధమవుతోంది. ఇక్కడ అన్నింటికన్నా కీలకమైనది ఏమిటంటే ఏ పథకం అమలు కావాలన్నా నిధుల కేటాయింపు చాలా కీలకం.
ఆ నిధుల విషయంలోనే కేసీయార్ పదేళ్ళ పాలన ఖజానాకు పెద్ద బొక్కపెట్టేసింది. రు. 7 లక్షల కోట్ల అప్పుల ప్రభుత్వానికి ఇపుడు కాంగ్రెస్ సారధ్యం వహిస్తోంది. కాబట్టి హామీల అమలుకు కాస్త సమయం పట్టడం తప్పదు. పదేళ్ళు అధికారంలో ఉండి జనాలను మోసంచేసిన విషయాన్ని కేటీయార్ మరచిపోయారా ? అంటు నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు. కేసీయార్ గడచిన రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలుచేశారని నెటిజన్లు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే 420 ప్రభుత్వం అని కేటీయార్ ఆరోపించటంపై జనాలు పెద్ద ఎత్తున మండిపోతున్నారు. దీంతో కేటీయార్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అనే ప్రచారం పెరిగిపోతోంది.
This post was last modified on January 5, 2024 11:55 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…