Political News

టీడీపీ,జనసేనను వదులుకునే ధైర్యం చేయలేకపోతున్నారు

గురువారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ పొత్తులపై తన అభిప్రాయాన్ని ఫైనల్ చేసిందా ? కమలనాథులు ఇచ్చిన సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికలు, పార్టీ పరిస్ధితి, పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటి నేతలు చర్చలు జరిపారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మెజార్టీ నేతలు పొత్తులుండాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు పెరుగుతాయేమో కానీ సీట్లు మాత్రం రావని సమావేశం అభిప్రాయపడింది.

ఇప్పటికే జనసేనతో పొత్తున్నా అది ప్రాక్టికల్ గా అమల్లో లేదన్న విషయాన్ని కూడా సమావేశం చర్చించింది. జనసేన అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో చేతులు కలిపిన విషయంపైన కూడా సమావేశం చర్చించింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఇప్పటికే అనేకసార్లు అగ్రనేతలకు సూచించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ గనుక టీడీపీతో పొత్తుకు ఇష్టపడకపోతే జనసేన ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళటం ఖాయమని సమావేశం అభిప్రాయపడింది.

అప్పుడు బీజేపీ ఒంటరి పోరాటం తప్పదని సమావేశంలో పలువురు తేల్చేశారు. అదేదో టీడీపీతో పొత్తు విషయాన్ని అగ్రనేతలు ఎంత తొందరగా ఫైనల్ చేస్తే ఎన్నికల్లో పోటీపై తమకు అంత క్లారిటి వస్తుందని కోర్ కమిటి సభ్యులు ఢిల్లీ నుండి ప్రతినిధిగా వచ్చిన శివప్రకాష్ కు స్పష్టంచేశారు. నేతల నుండి విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నపుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారట. నేతల అభిప్రాయాలను శివప్రకాష్ విడిగా తీసుకుని సీల్డ్ కవర్లో పెట్టుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మొదటి నుండి టీడీపీతో పొత్తుకే మొగ్గుచూపుతున్న విషయం అందరికీ తెలిసిందే. పురందేశ్వరి కాకుండా మరికొందరు నేతలు కూడా పదేపదే టీడీపీతో పొత్తుండాలనే చెబుతున్నారు. టీడీపీతో పొత్తులో ఐదు పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఒక జాబితా కూడా రెడీ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. రాజమండ్రి, విజయవాడ, రాజంపేట, నరసాపురం, అరకు లేదా తిరుపతి లోక్ సభ సీట్లలో పోటీకి బీజేపీ కీలకనేతలు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on January 5, 2024 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago