Political News

ఎవరు కాంగ్రెస్ లో చేరినా ఊడేదేం లేదు: కొడాలి నాని

వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల చేరికపై వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తుడిచిపెట్టుకుని పోయిందని. భూస్థాపితం అయిందని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఏ నాయకులను తెచ్చుకున్నా వాళ్లకు ఒనగూరేది ఏమీ లేదని, మాకు ఊడేది ఏమీ లేదని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా షర్మిలపై కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎందుకు చీలతాయని నాని ప్రశ్నించారు. పురందేశ్వరి బిజెపిలో చేరితే టిడిపి ఓట్లు చీలవా అని కొడాలి నాని ప్రశ్నించారు. ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ వైసీపీ ఓట్లు ఎలా చీలుస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హేమాహేమీలైన కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేసిన కాంగ్రెస్ రాష్ట్రంలో దిగజారడానికి మరో కారణం ఉందని నాని అన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ముద్దాయిగా చేశారని నాని చెప్పారు. జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టారని, అందుకే ఏపీలో దిక్కుమాలిన స్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటుందని విమర్శలు గుప్పించారు. ఈ కారణాలపై కాంగ్రెస్ హై కమాండ్ జగన్ కు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

కాగా, షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. జగన్ ను జైలుకు పంపించిన కాంగ్రెస్ లో ఎవరు చేరినా రాజకీయ ప్రత్యర్థులేనని, అలాగే చూస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్ కోసం తాము కష్టపడుతూనే ఉంటామని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం చంద్రబాబు, సోనియాగాంధీ నైజం అని పెద్దిరెడ్డి విమర్శించారు.

వైసీపీలో అవకాశం లేకే తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్నారని, ఆ తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. షర్మిల నిర్ణయంతో ఏపీకి గాని ఏపీ రాష్ట్రానికి, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. షర్మిలతో పాటు ఎవరు ఏ పార్టీలో చేరినా ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చిన ప్రజాశీస్సులు జగన్ కే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago