Political News

బీజేపీ కూడా కలిసిపోతుందా ?

పొత్తులో కలిసినడవాలని బీజేపీ కూడా డిసైడ్ అయ్యిందా ? ఇందుకు బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఇపుడిదే అంశంపై కమలనాదుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ నుండి పరిశీలకులుగా వచ్చిన నేతల నుండి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరగబోయే పార్టీ కోర్ కమిటి సమావేశంలో మరింత స్పష్టగ రాబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

తన మిత్రపక్షం బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే ఎన్నికలకు వెళ్ళటం చద్రబాబుకూ ఇష్టంలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ అగ్రనేతలు చివరకు టీడీపీ, జనసేనతో చేతులు కలపటానికి సానుకూలంగా స్పందిచారని పార్టీవర్గాల సమాచారం. పొత్తులో భాగంగా ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు కమలంపార్టీ నేతలు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సడెన్ గా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో బీజేపీ నేతలు కూడా పొత్తు విషయాన్ని పరిశీలించారట. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటే కమ్యూనిస్టులు కూడా జతకడితే ఇండియా కూటమి ఏపీలో కూడా పోటీచేయటం ఖాయం. అప్పుడు టీడీపీ, జనసేన మాత్రమే పోటీచేస్తే బీజేపీ ఒంటరైపోతుంది. అందుకనే టీడీపీ, జనసేనతో పొత్తుకు రెడీ అయితే ఏపీలో ఎన్డీయే కూటమి పోటీలో ఉన్నట్లవుతుందని అగ్రనేతలు భావించారట. అంటే మూడు పార్టీలతో ఒకవైపు ఇండియా కూటమి, మూడు పార్టీలతో మరోవైపు ఎన్టీయే కూటమి ఎన్నికలకు రెడీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఒంటరిపోటీకి రెడీగా ఉన్నారు.

కాకపోతే కూటముల్లో భాగంగా పార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాల ఏవన్న విషయం తేలటంలో కాస్త ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయం. ఆ సమస్యను గనుక పార్టీలు అధిగమిస్తే పొత్తులు సాఫీగా జరిగే అవకాశాలున్నాయి. అప్పుడు ఎన్నికలు చాలా రంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. మరి పొత్తులపై క్లారిటి ఎప్పుడొస్తుందో ? చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on January 4, 2024 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

46 minutes ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

55 minutes ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

58 minutes ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

1 hour ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

2 hours ago