పొత్తులో కలిసినడవాలని బీజేపీ కూడా డిసైడ్ అయ్యిందా ? ఇందుకు బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఇపుడిదే అంశంపై కమలనాదుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ నుండి పరిశీలకులుగా వచ్చిన నేతల నుండి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరగబోయే పార్టీ కోర్ కమిటి సమావేశంలో మరింత స్పష్టగ రాబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
తన మిత్రపక్షం బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే ఎన్నికలకు వెళ్ళటం చద్రబాబుకూ ఇష్టంలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ అగ్రనేతలు చివరకు టీడీపీ, జనసేనతో చేతులు కలపటానికి సానుకూలంగా స్పందిచారని పార్టీవర్గాల సమాచారం. పొత్తులో భాగంగా ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు కమలంపార్టీ నేతలు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సడెన్ గా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో బీజేపీ నేతలు కూడా పొత్తు విషయాన్ని పరిశీలించారట. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటే కమ్యూనిస్టులు కూడా జతకడితే ఇండియా కూటమి ఏపీలో కూడా పోటీచేయటం ఖాయం. అప్పుడు టీడీపీ, జనసేన మాత్రమే పోటీచేస్తే బీజేపీ ఒంటరైపోతుంది. అందుకనే టీడీపీ, జనసేనతో పొత్తుకు రెడీ అయితే ఏపీలో ఎన్డీయే కూటమి పోటీలో ఉన్నట్లవుతుందని అగ్రనేతలు భావించారట. అంటే మూడు పార్టీలతో ఒకవైపు ఇండియా కూటమి, మూడు పార్టీలతో మరోవైపు ఎన్టీయే కూటమి ఎన్నికలకు రెడీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఒంటరిపోటీకి రెడీగా ఉన్నారు.
కాకపోతే కూటముల్లో భాగంగా పార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాల ఏవన్న విషయం తేలటంలో కాస్త ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయం. ఆ సమస్యను గనుక పార్టీలు అధిగమిస్తే పొత్తులు సాఫీగా జరిగే అవకాశాలున్నాయి. అప్పుడు ఎన్నికలు చాలా రంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. మరి పొత్తులపై క్లారిటి ఎప్పుడొస్తుందో ? చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on January 4, 2024 6:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…