Political News

బీజేపీ కూడా కలిసిపోతుందా ?

పొత్తులో కలిసినడవాలని బీజేపీ కూడా డిసైడ్ అయ్యిందా ? ఇందుకు బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఇపుడిదే అంశంపై కమలనాదుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ నుండి పరిశీలకులుగా వచ్చిన నేతల నుండి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరగబోయే పార్టీ కోర్ కమిటి సమావేశంలో మరింత స్పష్టగ రాబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

తన మిత్రపక్షం బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే ఎన్నికలకు వెళ్ళటం చద్రబాబుకూ ఇష్టంలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ అగ్రనేతలు చివరకు టీడీపీ, జనసేనతో చేతులు కలపటానికి సానుకూలంగా స్పందిచారని పార్టీవర్గాల సమాచారం. పొత్తులో భాగంగా ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు కమలంపార్టీ నేతలు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సడెన్ గా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో బీజేపీ నేతలు కూడా పొత్తు విషయాన్ని పరిశీలించారట. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటే కమ్యూనిస్టులు కూడా జతకడితే ఇండియా కూటమి ఏపీలో కూడా పోటీచేయటం ఖాయం. అప్పుడు టీడీపీ, జనసేన మాత్రమే పోటీచేస్తే బీజేపీ ఒంటరైపోతుంది. అందుకనే టీడీపీ, జనసేనతో పొత్తుకు రెడీ అయితే ఏపీలో ఎన్డీయే కూటమి పోటీలో ఉన్నట్లవుతుందని అగ్రనేతలు భావించారట. అంటే మూడు పార్టీలతో ఒకవైపు ఇండియా కూటమి, మూడు పార్టీలతో మరోవైపు ఎన్టీయే కూటమి ఎన్నికలకు రెడీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఒంటరిపోటీకి రెడీగా ఉన్నారు.

కాకపోతే కూటముల్లో భాగంగా పార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాల ఏవన్న విషయం తేలటంలో కాస్త ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయం. ఆ సమస్యను గనుక పార్టీలు అధిగమిస్తే పొత్తులు సాఫీగా జరిగే అవకాశాలున్నాయి. అప్పుడు ఎన్నికలు చాలా రంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. మరి పొత్తులపై క్లారిటి ఎప్పుడొస్తుందో ? చివరకు ఏమవుతుందో చూడాలి.

Satya

Recent Posts

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

56 seconds ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

16 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago