తెలంగాణాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉన్నట్లున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో 2వ తేదీన చాలామందికి జీతాలు పడ్డాయి. కొన్ని శాఖల్లోని కొంతమంది ఉద్యోగులకు మాత్రం పడలేదంతే. వీళ్ళకు కూడా వీలైనంత తొందరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే జీతాలు పడేట్లుగా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రతినెలా మొదటి రెండురోజుల్లోనే జీతాలు పడక చాలా కాలమైంది. కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఏ రోజు జీతాలు పడతాయో కూడా ఎవరు చెప్పలేకపోయేవారు.
కొన్ని శాఖల్లోని ఉద్యోగులకు రెండో వారం, మరికొందరికి మూడోవారంలో జీతాలు పడేవి. జీతాలు వేయటానికి కేసీయార్ ప్రభుత్వం ఆల్పాబెట్ పద్దతిని అనుసరించేది. ఏ తో మొదలయ్యే విభాగాల ఉద్యోగులకు మొదటగా జీతాలు అందేది. అదికూడా నెల మొదటి రెండురోజుల్లో మాత్రం కాదు. తమిష్టం వచ్చినట్లు జీతాల తేదీలను మార్చేసేది. ఈ విషయంలో ఉద్యోగసంఘాలు ఎంతమొత్తుకున్నా కేసీయార్ పట్టించుకోలేదు. దేశంలోనే ధనిక రాష్ట్రమని చెప్పుకోవటమే కానీ ఆచరణలో మాత్రం ఏ విషయంలోనూ లేదు.
ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు నెల మొదట్లోనే జీతాలు వేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ విషయమై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే జనవరి 2వ తేదీన చాలామంది ఉద్యోగులకు జీతాలు ఖాతాల్లో డిపాజిట్ అయ్యింది. ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు, పెండింగ్ బిల్సన్నీ క్లియర్ చేసేట్లుగా రేవంత్ ఆర్ధికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటంటే ప్రతినెలా మూడోవారంలోనే జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లులను రెడీచేయాలి. మూడు కలిపి ఎంత మొత్తం అవుతుందో ముఖ్యమంత్రికి ఫైల్ పెట్టాలి. సీఎం ఆమోదం కాగానే సదరు బిల్లులను రెడీచేయాలి. అంటే ప్రతినెలా మూడోవారంలో సుమారు రు. 6 వేల కోట్లను జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం రెడీగా పెట్టుకోవాల్సిందే. అంతా రెడీ అయిన తర్వాత నాలుగివారంలో ఆర్ధికశాఖ నుండి ట్రెజరీలకు బిల్లులు శాంక్షన్ అయి వెళ్ళిపోతాయి. ఈ మేరకు ట్రెజరీ అధికారులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. కేసీయార్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారమంతా అస్తవ్యస్ధమైపోయింది. దాన్ని రేవంత్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు.
This post was last modified on January 4, 2024 12:51 pm
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…
మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…
మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…
స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…