Political News

ఉద్యోగులు హ్యాపీయేనా ?

తెలంగాణాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉన్నట్లున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో 2వ తేదీన చాలామందికి జీతాలు పడ్డాయి. కొన్ని శాఖల్లోని కొంతమంది ఉద్యోగులకు మాత్రం పడలేదంతే. వీళ్ళకు కూడా వీలైనంత తొందరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే జీతాలు పడేట్లుగా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రతినెలా మొదటి రెండురోజుల్లోనే జీతాలు పడక చాలా కాలమైంది. కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఏ రోజు జీతాలు పడతాయో కూడా ఎవరు చెప్పలేకపోయేవారు.

కొన్ని శాఖల్లోని ఉద్యోగులకు రెండో వారం, మరికొందరికి మూడోవారంలో జీతాలు పడేవి. జీతాలు వేయటానికి కేసీయార్ ప్రభుత్వం ఆల్పాబెట్ పద్దతిని అనుసరించేది. ఏ తో మొదలయ్యే విభాగాల ఉద్యోగులకు మొదటగా జీతాలు అందేది. అదికూడా నెల మొదటి రెండురోజుల్లో మాత్రం కాదు. తమిష్టం వచ్చినట్లు జీతాల తేదీలను మార్చేసేది. ఈ విషయంలో ఉద్యోగసంఘాలు ఎంతమొత్తుకున్నా కేసీయార్ పట్టించుకోలేదు. దేశంలోనే ధనిక రాష్ట్రమని చెప్పుకోవటమే కానీ ఆచరణలో మాత్రం ఏ విషయంలోనూ లేదు.

ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు నెల మొదట్లోనే జీతాలు వేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ విషయమై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే జనవరి 2వ తేదీన చాలామంది ఉద్యోగులకు జీతాలు ఖాతాల్లో డిపాజిట్ అయ్యింది. ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు, పెండింగ్ బిల్సన్నీ క్లియర్ చేసేట్లుగా రేవంత్ ఆర్ధికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటంటే ప్రతినెలా మూడోవారంలోనే జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లులను రెడీచేయాలి. మూడు కలిపి ఎంత మొత్తం అవుతుందో ముఖ్యమంత్రికి ఫైల్ పెట్టాలి. సీఎం ఆమోదం కాగానే సదరు బిల్లులను రెడీచేయాలి. అంటే ప్రతినెలా మూడోవారంలో సుమారు రు. 6 వేల కోట్లను జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం రెడీగా పెట్టుకోవాల్సిందే. అంతా రెడీ అయిన తర్వాత నాలుగివారంలో ఆర్ధికశాఖ నుండి ట్రెజరీలకు బిల్లులు శాంక్షన్ అయి వెళ్ళిపోతాయి. ఈ మేరకు ట్రెజరీ అధికారులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. కేసీయార్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారమంతా అస్తవ్యస్ధమైపోయింది. దాన్ని రేవంత్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు.

This post was last modified on January 4, 2024 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago