Political News

కాంగ్రెస్ లో విలీనమైన వైఎస్సార్టీపీ

అందరూ ఊహించినట్లే వైఎస్సార్టీపీకి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. ఈరోజు నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో భాగమైందని, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుందని అన్నారు.

తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ సేవ చేశారని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరిందని, ఇది రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని అన్నారు.

ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి గారు కలగన్నారని, అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది అని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

This post was last modified on January 4, 2024 12:30 pm

Share

Recent Posts

భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా…

30 minutes ago

NBK 111… గాయం మార్చిన లక్ష్యం

బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…

44 minutes ago

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

2 hours ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

5 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

10 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

12 hours ago