Political News

కాంగ్రెస్ లో విలీనమైన వైఎస్సార్టీపీ

అందరూ ఊహించినట్లే వైఎస్సార్టీపీకి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. ఈరోజు నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో భాగమైందని, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుందని అన్నారు.

తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ సేవ చేశారని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరిందని, ఇది రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని అన్నారు.

ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి గారు కలగన్నారని, అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది అని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

This post was last modified on January 4, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

40 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

12 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago