Political News

కాంగ్రెస్ లో విలీనమైన వైఎస్సార్టీపీ

అందరూ ఊహించినట్లే వైఎస్సార్టీపీకి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. ఈరోజు నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో భాగమైందని, కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు తమ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుందని అన్నారు.

తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ సేవ చేశారని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరిందని, ఇది రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని అన్నారు.

ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి గారు కలగన్నారని, అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది అని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

This post was last modified on January 4, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

25 minutes ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

1 hour ago

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని…

6 hours ago

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…

8 hours ago

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…

8 hours ago

నాగ్ అశ్విన్‌ను డిప్రెషన్లోకి నెట్టిన ‘ఇన్సెప్షన్’

డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…

9 hours ago